సౌదీ టార్గెట్: ఇరాన్లో తయారైన మిస్సైల్ని సంధించిన హౌతీ మిలిటెంట్స్
- December 16, 2017మనామా: సౌదీ పైకి యెమెన్లోని మిలిటెంట్స్ ప్రయోగించిన ఓ మిస్సైల్, ఇరాన్ తయారీగా రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేయడంతో, ఇరాన్ తీరు పట్ల బహ్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యెమెన్లో అల్లర్లకు ఇరాన్ ప్రోత్సాహం అందించడమే కాకుండా, అరబ్, జిసిసి దేశాల్లో అస్థిరతకు హౌతీ మిలిటెంట్స్కి ఇరాన్ అండగా ఉండి, ఆయుధాల్ని కూడా అందజేస్తోందని బహ్రెయిన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. అమెరికా, అలాగే యునైటెడ్ నేషన్స్ ఈ విషయంలో ఇరాన్ తీరుని తప్పు పట్టడాన్ని బహ్రెయిన్ ప్రస్తావించింది. ఇరాన్ తక్షణం ఈ చర్యల్ని ఆపాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశంతో అయినా స్నేహ సంబంధాలు కొనసాగించే ప్రశ్నే లేదని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలిసి పోరాడేందుకు బహ్రెయిన్ ముందుంటుందని బహ్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ