కన్నీటి పర్యంతమైన పీవీ సిం
- December 17, 2017
భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు కల మరోసారి చెదిరింది. చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో పోరాడి ఓడింది.. రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు 21-15, 12-21, 19-21తో జపాన్ ప్లేయర్ యమగుచి చేతిలో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్లో సింధుకి ఓటమి ఇది తొలిసారి కాదు. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం పాలైన సింధు, ఈ ఏడాదిఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ పోరులో ఓడిపోయింది. తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్లో మరోసారి అదే ఫలితం ఎదురైంది. దాదాపు గంటన్నరపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో మొదట్లో సింధు ఆధిక్యం కనబరిచినా, చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్ను యమగుచి గెలుచుకోగా.. కీలకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగింది.. అయితే ఊహించని రీతిలో పుంజుకున్న యమగుచి టైటిల్ను తన్నుకుపోయింది. ఆఖరి నిమిషంలో పరాజయం పాలవడంతో సింధు కన్నీటి పర్యంతమైంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక