ఔరా.. ఒక్క కౌగిలింత ఎంత పని చేసింది..?
- December 18, 2017
ఇద్దరు విద్యార్థులు బహిరంగంగా చేసుకున్న ఒక 'హగ్' ఏకంగా న్యాయవ్యవస్థనే కుదిపేసింది. కోర్టుకెకెక్కిన ఈ కేసులో చివరకు ఆ కౌగిలింతే గెలిచింది. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం సెయిట్ థామస్ స్కూల్లో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలివి. ఇంటర్మీడియేట్ చదువుతున్న ఒకబ్బాయి.. ఒకమ్మాయి.. స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ వేదిక మీద గాఢంగా కౌగిలించుకున్నారు. డజను మంది టీచర్లు, వందలాది మంది విద్యార్థులు సమక్షంలో జరిగిన ఈ 'రొమాంటిక్' సీన్.. ఆ తరువాత పెద్ద తతంగాన్నే క్రియేట్ చేసింది.
'ఇవ్వాళా రేపూ ఇదంతా కామన్' అంటూ అమ్మాయి, ఆమె పేరెంట్స్ లైట్ తీసుకున్నారు. అటు, అబ్బాయి, వాడి తల్లిదండ్రుల్లో కూడా తప్పు జరిగిందిన్న పశ్చాత్తాపం ఇసుమంతయినా లేదు. ఆ అమ్మాయి పెర్ఫామెన్స్ ని అభినందించడానికే మావాడు ఆలా చేశాడు.. అంటూ అడ్డంగా సమర్థించుకున్నారు. ఇక్కడ సమస్యంతా ఆ స్కూల్ యాజమాన్యానికి మాత్రమే స్కూల్ క్రమశిక్షణా నిబంధనల్ని ఉల్లంఘించాడని పేర్కొంటూ అతడి మీద సస్పెన్షన్ వేటు వేసింది స్కూల్ మేనేజ్మెంట్.
ఇదేమిటని ప్రశ్నించబోయిన బాబు పేరెంట్స్ మీద స్కూల్ ప్రిన్సిపాల్ రంకెలేశారు. మీవాడు అచ్చోసిన ఆంబోతులా మారాడని, పిల్లాడ్ని పెంచే పద్దతి ఇది కాదని, వీడ్నిలాగే వదిలేస్తే స్కూల్ మొత్తం గబ్బయిపోతుందని శాపనార్థాలు పెట్టిమరీ పంపించేశారు. మేం ఒకసారి హెచ్చరించినప్పటికీ.. అతడు 'హగ్' ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తించాడన్నది స్కూల్ మేనేజ్మెంట్ మోపిన అభియోగం.
దీంతో చేసేది లేక.. ఆ తండ్రి.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి ఫిర్యాదు చేసుకున్నాడు. క్రిమినల్ పీనల్ కోడ్ లోని కొన్ని సెక్షన్స్ ని ప్రస్తావిస్తూ.. పిల్లాడ్ని మళ్ళీ స్కూల్లో చేర్చుకోవాలంటూ ఆదేశాలొచ్చాయి. కానీ.. స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం ససేమిరా అంటూ హైకోర్టుకెక్కాడు. స్కూల్ డిసిప్లినరీ అంటూ ఒక కోడ్ పెట్టుకుని..
పిల్లల్ని దారిలో పెట్టాలన్న తమ చిత్తశుద్ధిని ఎలా శంకిస్తారని స్కూల్ యాజమాన్యం వాదించింది. దీంతో ఏకీభవించిన కోర్ట్ కూడా స్కూల్ విధించిన శిక్షను సమర్థిస్తూ ఆదేశాలిచ్చింది. అంతకుముందు.. క్షమాపణ పత్రం రాసిచ్చిమరీ పిల్లాడ్ని స్కూల్లో అడ్మిట్ చేసుకున్నప్పటికీ.. స్కూల్ బస్సు ఎక్కనివ్వకుండా, క్లాస్ మేట్స్ తో కలిసి పరీక్షల్ని రాయనివ్వకుండా మా వాడ్ని మరింత వేధించారని పేరెంట్స్ చెబుతున్నారు.
అయినా.. హైకోర్టు మన్నించకపోవడంతో సదరు విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీబీఎస్సీ, హైకోర్టు ఆదేశిస్తే.. ప్లస్2 ఎగ్జామ్స్ రాయించడానికి సమ్మతమేనంటూ స్కూల్ ప్రిన్సిపాల్ కాలరెగరేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







