పెరగనున్న న్యాయమూర్తుల వేతనాలు.!
- December 21, 2017
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు దిశగా ముందడుగు పడింది. న్యాయమూర్తుల వేతనాల పెంపునకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే 31 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 1,079 మంది హైకోర్టు న్యాయమూర్తులు, దాదాపు 2,500 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల వేతనాలు, ఫించన్, గ్రాట్యుటీ భారీగా పెరగనున్నాయి. వేతన పెంపు అమల్లోకి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.2.8లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.5లక్షలు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.25 లక్షల వరకు పెరిగే అవకాశముంది. 7వ కేంద్ర పే కమిషన్ నివేదిక ఆధారంగా న్యాయమూర్తుల వేతనాలను నిర్ణయించారు. వేతన పెంపును 1 జనవరి 2016 నుంచి అమలు చేయాలని బిల్లులో పొందుపర్చారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







