పెరగనున్న న్యాయమూర్తుల వేతనాలు.!
- December 21, 2017
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు దిశగా ముందడుగు పడింది. న్యాయమూర్తుల వేతనాల పెంపునకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే 31 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 1,079 మంది హైకోర్టు న్యాయమూర్తులు, దాదాపు 2,500 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల వేతనాలు, ఫించన్, గ్రాట్యుటీ భారీగా పెరగనున్నాయి. వేతన పెంపు అమల్లోకి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.2.8లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.5లక్షలు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.25 లక్షల వరకు పెరిగే అవకాశముంది. 7వ కేంద్ర పే కమిషన్ నివేదిక ఆధారంగా న్యాయమూర్తుల వేతనాలను నిర్ణయించారు. వేతన పెంపును 1 జనవరి 2016 నుంచి అమలు చేయాలని బిల్లులో పొందుపర్చారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







