పెరగనున్న న్యాయమూర్తుల వేతనాలు.!

- December 21, 2017 , by Maagulf
పెరగనున్న న్యాయమూర్తుల వేతనాలు.!

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు దిశగా ముందడుగు పడింది. న్యాయమూర్తుల వేతనాల పెంపునకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే 31 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 1,079 మంది హైకోర్టు న్యాయమూర్తులు, దాదాపు 2,500 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తుల వేతనాలు, ఫించన్‌, గ్రాట్యుటీ భారీగా పెరగనున్నాయి. వేతన పెంపు అమల్లోకి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.2.8లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.5లక్షలు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.25 లక్షల వరకు పెరిగే అవకాశముంది. 7వ కేంద్ర పే కమిషన్‌ నివేదిక ఆధారంగా న్యాయమూర్తుల వేతనాలను నిర్ణయించారు. వేతన పెంపును 1 జనవరి 2016 నుంచి అమలు చేయాలని బిల్లులో పొందుపర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com