ఉద్యోగుల వేతనాల పెంపుకి ఆదేశం
- December 21, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఉద్యోగుల జీతాల మొత్తాన్ని 600 మిలియన్ దిర్హామ్లకు పెంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేతనాలకు సంబంధించి ఈ పెంపు జరగనుంది. జనవరి 1 నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అత్యల్ప వేతంనం 17,500 దిర్హామ్లు గతంలో ఉండగా, దాన్ని ఇప్పుడు 18,500 దిర్హామ్లుగా పెంచుతున్నారు. ఫస్ట్ గ్రేడ్కి చెందిన ఉద్యోగి మొత్తంగా 30,500 దిర్హామ్ల వేతనం పొందనున్నారు. ఇందులో 21,375 దిర్హామ్లు బేసిక్ సేలరీ కాగా, 7,125 దిర్హామ్లు లివింగ్ అలవెన్స్. సోషల్ ఇంక్రిమెంట్ 2,000, అలాగే చైల్డ్ అలవెన్స్ 600 దిర్హామ్లు, యాన్యువల్ ఇంక్రిమెంట్ 300 వంటివి ఉంటాయి. షార్జా రూలర్, ఎమిరేటీ గవర్నమెంట్ రిటైరీలకు పెన్షన్ కూడా పెంచాలని ఆదేశించినట్లు హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ తారిక్ బిన్ ఖాదెమ్ చెప్పారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







