ఉద్యోగుల వేతనాల పెంపుకి ఆదేశం

- December 21, 2017 , by Maagulf
ఉద్యోగుల వేతనాల పెంపుకి ఆదేశం

షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి, ఉద్యోగుల జీతాల మొత్తాన్ని 600 మిలియన్‌ దిర్హామ్‌లకు పెంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్‌లో గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ వేతనాలకు సంబంధించి ఈ పెంపు జరగనుంది. జనవరి 1 నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అత్యల్ప వేతంనం 17,500 దిర్హామ్‌లు గతంలో ఉండగా, దాన్ని ఇప్పుడు 18,500 దిర్హామ్‌లుగా పెంచుతున్నారు. ఫస్ట్‌ గ్రేడ్‌కి చెందిన ఉద్యోగి మొత్తంగా 30,500 దిర్హామ్‌ల వేతనం పొందనున్నారు. ఇందులో 21,375 దిర్హామ్‌లు బేసిక్‌ సేలరీ కాగా, 7,125 దిర్హామ్‌లు లివింగ్‌ అలవెన్స్‌. సోషల్‌ ఇంక్రిమెంట్‌ 2,000, అలాగే చైల్డ్‌ అలవెన్స్‌ 600 దిర్హామ్‌లు, యాన్యువల్‌ ఇంక్రిమెంట్‌ 300 వంటివి ఉంటాయి. షార్జా రూలర్‌, ఎమిరేటీ గవర్నమెంట్‌ రిటైరీలకు పెన్షన్‌ కూడా పెంచాలని ఆదేశించినట్లు హ్యూమన్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ తారిక్‌ బిన్‌ ఖాదెమ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com