రాహుల్గాంధీ యూఏఈ పర్యటన వాయిదా
- December 24, 2017
దుబాయ్: జనవరి 9న యూఏఈలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటన వాయిదా పడింది. కొన్ని ప్రత్యేక కారణాలతో వాయిదాపడ్డ ఈ పర్యటన, తిరిగి ఎప్పుడు చేపట్టేదీ త్వరలో తేలనున్నట్లు ఇన్కాస్ యూఏఈ కమ్యూనిటీ జనరల్ సెక్రెటరీ పున్నక్కన్ మొహమ్మద్ అలి చెప్పారు. ఇన్కాస్ ప్రెసిడెంట్ మహాదేవన్, అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 9 పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇంతలోనే రాహుల్ టూర్ వాయిదా పడినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టాక రాహుల్గాంధీ జీసీసీ దేశాల్లో తొలిసారిగా పర్యటించాల్సి ఉంది. రాహుల్ పర్యటనకు సంబంధించి ఎఐసిసికి సంబంధించి కొందరు ప్రముఖులు యూఏఈ వచ్చి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక