గుండెపోటుతో మృతి చెందిన వలసదారుడు

- December 25, 2017 , by Maagulf
గుండెపోటుతో మృతి చెందిన వలసదారుడు

మనామా: 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు, గుండెపోటుతో మరణించారు. రమీ స్యూట్స్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న రజాక్‌ థరెమాల్‌, అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు పూర్తి చేశారు. సోషల్‌ వర్కర్‌ బషీర్‌ అంబల్లయ్‌ మాట్లాడుతూ, కువైట్‌ మస్జీద్‌ - గుడైబియాలో ఉదయం 9.30 నిమిషాలకు ప్రార్థనలు జరిగినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళ మృతుడి స్వరాష్ట్రం. మృతుడికి భార్య నజీమా, ముగ్గురు పిల్లలు షఫీక్‌, షమ్లా, తస్లీమా ఉన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com