మాలిక్యులస్ ఫైల్స్: యూఏఈ మినిస్ట్రీ హెచ్చరిక
- December 26, 2017
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ లేదా ఇ-మెయిల్ ద్వారా మాలిక్యులస్ పీడీఎఫ్ ఫైల్స్ని పంపడం నేరమని ప్రకటించింది. ఈ తరహా చర్యల ద్వారా ఇతరుల ఫోన్లలోని డేటాని తస్కరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టిఆర్ఎ పేర్కొంది. టిఆర్ఎ - నేషనల్ పిసి ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్, గడచిన పది నెలల్లో ఈ తరహా ఎటాక్స్ని 15 వరకు ఎదుర్కొన్నామనీ, ఈ సైబర్ ఎటాక్స్ ప్రధానంగా ప్రభుత్వ మరియు సెమీ గవర్నమెంట్ బాడీస్కి చెందిన కంప్యూటర్స్ని టార్గెట్ చేస్తున్నాయనీ, ప్రైవేట్ సెక్టార్కి కూడా వీటి కారణంగా ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ డివైజెస్ని వినియోగిస్తున్నవారు, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, తెలిసిగానీ తెలియకగానీ ఫైల్స్ని గ్రూప్స్లో షేర్ చేయరాదని టిఆర్ఎ సూచించింది. యాంటీ సెక్యూరిటీ వైరస్ని పీడీఎఫ్ ఫైల్స్లో నింపి, వాటి ద్వారా ఇతర కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్లోని డేటాని తస్కరిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. తద్వారా ఆయా కంప్యూటర్స్ని హాకర్స్ తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







