మాలిక్యులస్ ఫైల్స్: యూఏఈ మినిస్ట్రీ హెచ్చరిక
- December 26, 2017
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ లేదా ఇ-మెయిల్ ద్వారా మాలిక్యులస్ పీడీఎఫ్ ఫైల్స్ని పంపడం నేరమని ప్రకటించింది. ఈ తరహా చర్యల ద్వారా ఇతరుల ఫోన్లలోని డేటాని తస్కరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టిఆర్ఎ పేర్కొంది. టిఆర్ఎ - నేషనల్ పిసి ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్, గడచిన పది నెలల్లో ఈ తరహా ఎటాక్స్ని 15 వరకు ఎదుర్కొన్నామనీ, ఈ సైబర్ ఎటాక్స్ ప్రధానంగా ప్రభుత్వ మరియు సెమీ గవర్నమెంట్ బాడీస్కి చెందిన కంప్యూటర్స్ని టార్గెట్ చేస్తున్నాయనీ, ప్రైవేట్ సెక్టార్కి కూడా వీటి కారణంగా ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ డివైజెస్ని వినియోగిస్తున్నవారు, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, తెలిసిగానీ తెలియకగానీ ఫైల్స్ని గ్రూప్స్లో షేర్ చేయరాదని టిఆర్ఎ సూచించింది. యాంటీ సెక్యూరిటీ వైరస్ని పీడీఎఫ్ ఫైల్స్లో నింపి, వాటి ద్వారా ఇతర కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్లోని డేటాని తస్కరిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. తద్వారా ఆయా కంప్యూటర్స్ని హాకర్స్ తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







