ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం, 14 మంది మృతి

- December 28, 2017 , by Maagulf
ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం, 14 మంది మృతి

ముంబయి మహానగరంలోని లోయర్‌పరేల్‌లోగల కమల మిల్స్‌ సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. సముదాయంలోని లండన్‌ టాక్సీ గ్యాస్ట్రో పబ్‌లో తొలుత మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com