ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం, 14 మంది మృతి
- December 28, 2017ముంబయి మహానగరంలోని లోయర్పరేల్లోగల కమల మిల్స్ సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. సముదాయంలోని లండన్ టాక్సీ గ్యాస్ట్రో పబ్లో తొలుత మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ