ఎస్బిఐ బహ్రెయిన్కి సిసా సెక్యూరిటీ సర్టిఫికేషన్
- December 29, 2017
మనామా: ఎస్బిఐ బహ్రెయిన్, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ (పిసిఐ డిఎస్ఎస్వి 3.2) సర్టిఫికేషన్ పొందింది. జిసిసి దేశాల్లోనే అతి పెద్ద క్యుఎస్ఎ కంపెనీ అయినా సిసా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డబ్ల్యుఎల్ఎల్ నుంచి ఈ అవార్డుని ఎస్బిఐ అందుకుంది. బహ్రెయిన్లోని రిటైల్ బ్యాంకింగ్ బ్రాంచ్లో జరిగిన ఓ కార్యక్రమంలో సిసా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వరల్డ్ వైడ్ సిఇఓ మరియు ఫౌండర్, దర్శన్ శాంతమూర్తి సర్టిఫికెట్ని సిఇఓ ప్రభా సింగ్కి అందజేశారు. మెవనా రీజియన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ టివిఎస్ రమణారావు సమక్షంలో ఈ అవార్డు అందజేయడం జరిగింది. కంట్రీ హెడ్ మరియు సిఇఓ ఎస్బిఐ, డబ్ల్యుబిబి బహ్రెయిన్ షమ్షేర్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ స్టిమ్స్ అలాగే కార్డ్ డేటా, భద్రత వంటి విభాగాల్లో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే ఎస్బిఐ బహ్రెయిన్కి ఈ గుర్తింపు దక్కిందని ప్రతినిథులు వివరించారు. విపి (ఆపరేషన్స్) అమిత్ షర్మ, ఎవిపి (సిస్టమ్స్ అనంత్, సిస్టమ్స్ ఆఫీసర్ శంకర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







