మోదీ, గాంధీ లతో సెల్ఫీ
- January 06, 2018
జాతిపిత మహాత్మాగాంధీతో ప్రధాని నరేంద్రమోదీ కలిసి ఉన్న ఈ దృశ్యం మన భాగ్యనగరంలోని చారిత్రక చార్మినార్ వద్ద శనివారం సాక్షాత్కరించింది. గాంధీ మహాత్ముడితో ప్రధాని మోదీ భేటీ ఎలా సాధ్యం..? ఇందుకు అవకాశమే లేదు కదా..?? అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా..! మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులూ.. ఎంతమాత్రం నరేంద్ర మోదీ, గాంధీజీలు కాదు.. అచ్చుగుద్దినట్టు వారి పోలికలతో కనిపిస్తోన్న సదానంద్నాయక్, అగస్టీన్లు.. కర్ణాటక, గోవాల నుంచి హైదరాబాద్ సందర్శనకు వచ్చిన ఈ ఇద్దరూ చార్మినార్ వద్ద యాదృచ్ఛికంగా కలిశారు. దీంతో పర్యాటకులు, స్థానికులు వీరిని చూసేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా యువత వారితో పెద్దఎత్తున సెల్ఫీలు దిగడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక