స్కూల్లో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి
- January 13, 2018
సౌదీ అరేబియా:సౌదీ స్టూడెంట్ ఒకరు, అనారోగ్యంతో కన్నుమూసిన ఘటన అందర్నీ కలచివేసింది. క్లాస్లో ఎగ్జామ్ రాస్తున్న సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన అతన్ని ఇంటికి తరలించారు. అయితే అతని ప్రాణాల్ని మాత్రం కాపాడలేకపోయారు. మృతుడు మౌత్ ముస్లిమ్ సలౌమ్ అల్ అవ్ఫి, కౌస్ బిన్ సాద్ అల్ అన్సారీ స్కూల్ (మదీనాలో) విద్యనభ్యసిస్తున్నాడు. అల్ అరేబియా వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడిది సహజ మరణమేనని తెలియవస్తోంది. మెరిట్ స్టూడెంట్ అయిన అల్ అవ్ఫి మృతి చెందడం పట్ల స్కూలు యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ బిడ్డ మృతితో అతని తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. తల్లిదండ్రులు, సన్నిహితులు, స్కూల్ ప్రిన్సిపల్ సైతం విద్యార్థి ఎలాంటి అనారోగ్యానికీ గురి కాలేదనీ, ఎలా చనిపోయాడో తమకి అర్థం కావడంలేదని చెబుతున్నారు. అలసిపోయినట్లుగా చెప్పడంతో వెంటనే పారామెడిక్స్ని రప్పించామనీ, పరీక్ష రాస్తున్న సమయంలో తీవ్ర ఇబ్బందికి గురి కావడంతో ఇంటికి కారుని ఏర్పాటు చేశామనీ, దురదృష్టవశాత్తూ అతను చనిపోయాడని స్కూల్ ప్రిన్సిపల్ మహాల్ అల్ అవ్ఫి చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







