మదీనాలో ఎటువంటి భూకంప నష్టం నమోదు కాలేదు
- January 16, 2018
మదీనా: స్వల్ప స్థాయిలో భూకంప అనుభవాన్ని మంగళవారం మదీనావాసులు చవి చూసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ భూకంప ప్రభావం కారణంగా ఎలాంటి నష్టాలూ లేవని భూకంప అప్రమత్తత మరియు పర్యావరణ పరిరక్షణ ప్రతినిధి తారీఖ అబల్ ఖైల్ ప్రకటించారు. ఉత్తరదక్షిణ ప్రాంతంలోని మదీనాకు14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం చాలా బలహీన స్థాయిలో ప్రమాదం కలుగని రీతిలో ఉందని వివరించారు. "నేషనల్ కమీషన్ ఫర్ భూకంప మరియు భూకంప పర్యవేక్షణ (ఇ సి సి) ప్రకంపన ఈ తీవ్రత రిక్టర్ స్కేల్ పై 2.5 డిగ్రీల పరిమాణంతో మంగళవారం మధ్యాహ్నం 2:59 సమయంలో రికార్డ్ కాబడింది. మరోవైపు, మాదినాలోని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ప్రతినిధి కల్లా ఖలేద్ అల్-జోహని మాట్లాడుతూ, సివిల్ డిఫెన్స్ వద్ద మార్గదర్శక కేంద్రం 3.00 గంటలకు భూకంప సమాచారం పొందింది మదీనా పశ్చిమాన ఉన్న పట్టణ ప్రాంతాల్లోని నివాసితుల భూకంప అనుభవం గూర్చి మంగళవారం పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిని నిర్ధారిస్తూ మదీనాలో భూకంపం సంభవించినట్లు భూకంపం రిక్టర్ స్కేల్పై 2.5 డిగ్రీల కొలత నమోదయిందని సౌదీ జియోలాజికల్ సర్వే సైతం ప్రకటించింది. ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం అందుకోలేదని మదీనాలోని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్రహ్మాన్ అల్-హర్బీపేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు