భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఓం ప్రకాశ్ రావత్
- January 21, 2018
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సీఈసీ గా కొనసాగుతున్న అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటితో ముగియనుంది. దాంతో ఆ పదవిని ఓం ప్రకాశ్ రావత్ తో భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన వారు రావత్. పలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో పని చేశారు. కాగా అయన భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్గా విధులు నిర్వహించిన రావత్ ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా పని చేశారు. పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ప్రధాన మంత్రి అవార్డు కూడా లభించింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక