ఫ్యుజైరా అగ్ని ప్రమాదం: 7 గురు చిన్నారుల మృతి
- January 22, 2018
ఫ్యుజైరా:ఫ్యుజైరాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం 7 గురు చిన్నారుల్ని బలికొంది. పిల్లలు నివసిస్తోన్న రూమ్లోని ఎయిర్ కండిషనర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత అవి మిగతా ఇల్లంతా వ్యాపించాయి. తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే ఆ చిన్నారుల తల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకోగానే రికార్డు సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నా, అప్పటికే 7 గురు చిన్నారులు మృతి చెందారు. వీరిలో నలుగురు అబ్బాయిలు కాగా, ముగ్గురు అమ్మాయిలు. వీరిలో 13 ఏళ్ళ వ్యక్తి అత్యధిక వయసు కాగా, అత్యల్ప వయసు 5 సంవత్సరాలు. ఇంట్లో పొగ వాసన రావడంతో మేల్కొన్న తల్లి, వెళ్ళి చూసేసరికి మంటలు వ్యాపించాయని, పోలీసులకు సమాచారం అందించగానే సంఘటనా స్థలానికి వెళ్ళామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల కారణాల్ని తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు పోలీసులు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







