అల్-బహా విహార యాత్రలో విషాదం 9 మంది ప్రవాసీయులు మృతి

- January 22, 2018 , by Maagulf
అల్-బహా విహార యాత్రలో విషాదం 9 మంది ప్రవాసీయులు మృతి

జెడ్డా : శనివారం సాయంత్రం అల్-బహా ప్రాంతంలోని పర్వత రహదారిపై ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టడడంతో ఆ వ్యాన్ లో  ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రవాసియ కార్మికులు అక్కడికి అక్కడే  మృతి చెందగా , మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బాలజూరరి ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఆహారం అందించే ఒక క్యాటరింగ్ సంస్థకు చెందిన కార్మికులు. వీరు తమ సెలవుని గడిపేందుకు క్కునఫుడా కొర్నిచ్  కు వెళుతున్నారు. సమయం తక్కువ ఉండటంతో వారు అడ్డదారి  పర్వత మార్గం ద్వారా ప్రయాణించాలని ఎంచుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో మహ్మద్ సయీద్ అల్-అతిఫ్, హనీ ఆలీ అహ్మద్, మజిద్ అల్ సయద్ మరియు ఆలీ విన్ దబ్దేన్ (నలుగురు ఈజిప్షియన్లు), మాలమ్ మియా, ఆలం షా మియా, సైఫ్ ఉల్ ఇస్లాం అబు బషీర్ (ముగ్గురు బంగ్లాదేశీయులు), షా ఆలం (ఒక భారతీయ జాతీయ) మరో భారతీయ కార్మికుడు ఆసుపత్రిలో మరణించాడు. అల్-బహా ప్రాంతంలోని ఎమిర్  ప్రిన్స్ డాక్టర్  హస్సాం బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ మరణించిన కార్మికుల కుటుంబాలకు తన సంతాపాన్ని అందించాడు మరియు గాయపడినవారందరు త్వరితగతిన కోలుకోవాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com