భావన్స్‌ జిసిసి స్పెల్‌ బీలో మెరిసిన 'బిఐఎస్‌' విద్యార్థులు

- January 22, 2018 , by Maagulf
భావన్స్‌ జిసిసి స్పెల్‌ బీలో మెరిసిన 'బిఐఎస్‌' విద్యార్థులు

భావన్స్‌ జిసిసి స్పెల్‌ బీ - గ్రాండ్‌ పినాలెలో బహ్రెయిన్‌ ఇండియన్‌ స్కూల్‌ (బిఐఎస్‌) విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇండియన్‌ ఎడ్యుకేషనల్‌ స్కూల్‌, కువైట్‌ - జనవరి 20న ఈ ఈవెంట్‌ నిర్వహించింది. బిఐఎస్‌ ఎడ్యుకేటర్‌ అర్పితా దత్తా, ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ ఫ్యాకల్టీ సభ్యులు ఈ కాంపిటీషన్‌ని కో-ఆర్డినేట్‌ చేశారు. పార్థ్‌ గుప్తా కేటిరీ 1లో స్పెల్‌ బీ చాంపియన్‌గా నిలవగా, 50,000 రూపాయలు బహుమతిగా లభించింది. కేటగిరీ2లో మానిని లలిత్‌ దేశాయ్‌, కేటగిరీ 3లో స్టీవ్‌ చలిల్‌ బిజు విజేతలుగా నిలిచారు. మహిమా సుసాన్‌ కేటగిరీ 4లో విజయం దక్కించుకున్నారు. ఈ విజయం తల్లిదండ్రులకు, విద్యార్థులకు, బిఐఎస్‌కి ప్రౌడ్‌ మూమెంట్‌ అని చెప్పక తప్పదు. బిఐఎస్‌ డైరెక్టర్స్‌, ప్రిన్సిపాల్‌, కో-ఆర్డినేటర్‌, టీచర్స్‌ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. హార్డ్‌ వర్క్‌కి తగిన గుర్తింపు దక్కిందని వారు విద్యార్థుల్ని ఉద్దేశించి పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com