ఆ వార్తల్లో నిజం లేదు అని కొట్టిపారేసిన : దర్శకేంద్రుడు
- January 24, 2018టీటీడీ ఛైర్మన్గా తాను బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు ప్రముఖ దర్శకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు. బోర్డ్ ఛైర్మన్గా రాఘవేంద్రరావు బాధ్యతలు చేపడుతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు.
'నేను టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు చేపడుతున్నానని వార్తలు వస్తుండడంతో వేలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. ఎస్వీఎస్సీ ఛానెల్ ద్వారా స్వామివారికి సేవ చేస్తున్నాను. శ్రీవారికి చెందిన కార్యక్రమాలను మరింత వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరిస్తూ ఆయన సేవలో తరించాలన్నది నా కోరిక.' అని దర్శకేంద్రుడు ట్వీట్ చేశారు. దీంతో ఆ వార్తలు తెరపడింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం