ఏజెంట్లు మోసం: హైదరాబాద్ చేరుకున్న మలేసియా బాధితులు
- January 25, 2018
ఏజెంట్లు మోసం చేయడంతో మలేసియాలో చిక్కుకుపోయిన ముగ్గురు హైదరాబాద్ యువకులు తిరిగి సురక్షితంగా నగరం చేరుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశం ఉందని చెప్పడంతో కార్వాన్ నటరాజ్ నగర్కు చెందిన బిలాల్, ఇబ్రహీం, మతీన్ అలీలు కౌలాలంపూర్ వెళ్లారు. భారీగా డబ్బులు చెల్లించారు. కానీ అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో బరువులు మోసే పనికి పెట్టడంతో ఇబ్బందులుపడ్డారు.
కంపెనీ వారు పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవడంతో తిరిగి ఇండియా రాలేకపోయారు. తమను ఆదుకోవాలంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన సుష్మ కౌలాలంపూర్ ఎంబసీ అధికారులతో మాట్లాడి యువకులు తిరిగి హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో నెల తర్వాత తిరిగి నగరానికి చేరుకున్నారు. మంత్రి సుష్మాస్వరాజ్, మలేసియా ఎంబసీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







