ఏజెంట్లు మోసం: హైదరాబాద్ చేరుకున్న మలేసియా బాధితులు
- January 25, 2018
ఏజెంట్లు మోసం చేయడంతో మలేసియాలో చిక్కుకుపోయిన ముగ్గురు హైదరాబాద్ యువకులు తిరిగి సురక్షితంగా నగరం చేరుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశం ఉందని చెప్పడంతో కార్వాన్ నటరాజ్ నగర్కు చెందిన బిలాల్, ఇబ్రహీం, మతీన్ అలీలు కౌలాలంపూర్ వెళ్లారు. భారీగా డబ్బులు చెల్లించారు. కానీ అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో బరువులు మోసే పనికి పెట్టడంతో ఇబ్బందులుపడ్డారు.
కంపెనీ వారు పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవడంతో తిరిగి ఇండియా రాలేకపోయారు. తమను ఆదుకోవాలంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన సుష్మ కౌలాలంపూర్ ఎంబసీ అధికారులతో మాట్లాడి యువకులు తిరిగి హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో నెల తర్వాత తిరిగి నగరానికి చేరుకున్నారు. మంత్రి సుష్మాస్వరాజ్, మలేసియా ఎంబసీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







