ఏజెంట్లు మోసం: హైదరాబాద్ చేరుకున్న మలేసియా బాధితులు

- January 25, 2018 , by Maagulf
ఏజెంట్లు మోసం: హైదరాబాద్ చేరుకున్న మలేసియా బాధితులు

ఏజెంట్లు మోసం చేయడంతో మలేసియాలో చిక్కుకుపోయిన ముగ్గురు హైదరాబాద్ యువకులు తిరిగి సురక్షితంగా నగరం చేరుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశం ఉందని చెప్పడంతో కార్వాన్‌ నటరాజ్‌ నగర్‌కు చెందిన బిలాల్, ఇబ్రహీం, మతీన్ అలీలు కౌలాలంపూర్ వెళ్లారు. భారీగా డబ్బులు చెల్లించారు. కానీ అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో బరువులు మోసే పనికి పెట్టడంతో ఇబ్బందులుపడ్డారు. 

కంపెనీ వారు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవడంతో తిరిగి ఇండియా రాలేకపోయారు. తమను ఆదుకోవాలంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన సుష్మ కౌలాలంపూర్ ఎంబసీ అధికారులతో మాట్లాడి యువకులు తిరిగి హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో నెల తర్వాత తిరిగి నగరానికి చేరుకున్నారు. మంత్రి సుష్మాస్వరాజ్, మలేసియా ఎంబసీకి ధన్యవాదాలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com