ఫాన్స్ ని తీవ్రంగా హార్ట్ చేసిన మహేష్ బాబు
- January 26, 2018
డైరెక్టర్ కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో 'ఫస్ట్ ఓథ్' పేరిట వచ్చిన " భరత్ అనే నేను" సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాలో చెప్పిన డైలాగ్ తెలంగాణ మహేష్ బాబు అభిమానుల మనోభావాలను దెబ్బతీసింది అట. అసలు విషయానికొస్తే భరత్ అనే నేను సినిమా లో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని మనకందరికీ తెలుసు.
అయితే సినిమాలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి గా కనిపించడం తో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అభిమానులకు మనసు నొచ్చుకుంది అట. రాష్ట్రం విడిపోయినా తరవాత అన్ని విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చాయి కానీ సినిమా పరిశ్రమ విషయం వచ్చేటప్పటికి రెండు రాష్ట్రాల ప్రజలు తమ హీరోలను ప్రాంతీయపరంగా చూడకుండా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పైగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది సినిమా హీరోలకు తెలంగాణ రాష్ట్రంలో మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబు తనను తాను ఆంధ్రప్రదేశ్ ప్రాంత వ్యక్తిగా చూపించుకోవడం తెలంగాణను కొంత కించపరిచినట్లు ఉంది అని చాలామంది అభిమానులు అంటున్నారు.
దర్శకుడు ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని టాక్ కూడా వినిపిస్తుంది. రెండు రాష్ట్రాలు కలిసి ఉండేట్లు లేక మరో పేరు ఏదైనా ఆలోచించాల్సింది. మరి సినిమాలో కనీసం ఇతర అభిమానులు ఫీల్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక