మలయాళం స్టార్ షకీలా 250వ చిత్రం వస్తోంది
- January 27, 2018హైదరాబాద్: జీ స్టూడియోస్ పతాకంపై మలయాళం స్టార్ షకీలా హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీలవతి’. సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్లో ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ‘మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మా నిర్మాతలు గణేష్, వీరబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్ క్రిష్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది’ అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్. గణేష్ మాట్లాడుతూ.. ‘ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు. గీతాంజలి, లడ్డు, అశోక్బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తరుణ్ కరమ్తోత్, డైలాగ్స్: యష్ యాదవ్.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు