మరో బ్లాక్ బస్టర్: 'టచ్ చేసి చూడు'

- January 27, 2018 , by Maagulf
మరో బ్లాక్ బస్టర్: 'టచ్ చేసి చూడు'

టాలీవుడ్ లో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న రవితేజ గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా అపజాయాలు పొందుతూ వచ్చాడు. ఒకదశలో కెరీర్ కి పులిస్టాప్ పెడతాడా అన్న అనుమానాలు కూడా కలిగాయి. గత సంవత్సరం 'రాజా ది గ్రేట్' సినిమాతో మల్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాత్ రవితేజ పవర్ ఏంటో నిరూపించాడు..అంతే కాదు ఓ హీరో అంధుడిగా నటించి ఎలా మెప్పించాలో..ఈ సినిమాలో చూపించి అందరిచేత షభాష్ అనిపించుకున్నాడు. రవితేజ యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

మాస్ రాజా రవితేజ అప్ కమింగ్ మూవీ 'టచ్ చేసి చూడు' ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. విక్రమ్ సిరికొండతో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'టచ్ చేసి చూడు' ఫిబ్రవరి 2 ప్రేక్షకుల ముందుకి రానుంది. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన వివి వినాయక్, హరీష్ శంకర్‌లు 'టచ్ చేసి చూడు' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకిడిగా పరిచయం అవుతున్న విక్రమ్ సిరికొండకు విషెష్ తెలియజేశారు.

ఇక హీరో హీరో రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాకోసం చాలా మంది టెక్నీషియన్స్ పనిచేశారని.. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన కేఏజీ త్రయానికి థాంక్స్‌ తెలియజేశారు. దర్శకుడు విక్రమ్ సిరి తాను ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారన్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ఓ మంచి దర్శకుడు రాబోతున్నారన్నారు. హీరోయిన్స్ రాశీఖన్నా, సీరత్ కపూర్‌ గురించి మాట్లాడుతూ.. వాళ్లు ఎంత అందంగా ఉంటారో వాళ్ల ప్రవర్తన కూడా అంతే అందంగా ఉంటుందన్నారు. ఇప్పటికే రాశీతో ఓ సినిమా చేశానని, సీరత్‌తో ఇదే తొలి చిత్రమన్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ మంచి కథ అందించారని తప్పకుండా 'టచ్ చేసి చూడు' ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com