మెయిడ్ హత్య: తల్లి, కుమార్తెకి జైలు
- February 03, 2018
యు.ఏ.ఈ:కల్బా క్రిమినల్ కోర్టు, గల్ఫ్ జాతీయురాలైన తల్లి, ఆమె కుమార్తెకు ఏడాది, ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బహిష్కరిస్తారు. తమ దగ్గర పనిచేస్తున్న మెయిడ్ని చిత్ర హింసలు పెట్టి, ఆమె మృతికి కారణమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిపై కేసు నమోదయ్యింది. నిందితుల భర్త, మెయిడ్కి స్పాన్సరర్. అతనికీ 3,000 దిర్హామ్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఏడాదిన్నరపాటు ఈ కేసు విచారణ జరిగింది. మృతురాలి కుటుంబం, నిందితులకు క్షమాభిక్ష పెట్టారు, బ్లడ్ మనీని అంగీకరించారు. కొన్నాళ్ళ క్రితం ఈ కేసు వెలుగు చూసింది. అంబులెన్స్ సాయం కోసం పోలీసులకు సమాచారం అందగా, అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందికి అక్కడ ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఆమె శరీరంపై తీవ్రగాయాలున్నట్లు సిబ్బంది గుర్తించి, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. విచారణలో, ఆమెపై విచక్షణా రహితంగా దాడి జరిగినట్లు తేలింది. అయితే స్పాన్సరర్ కుటుంబ సభ్యులు, వేధింపుల ఆరోపణల్ని కొట్టి పారేశారు. విచారణలో మాత్రం దాడి జరిగిందని నిరూపితం కావడంతో, నిందితులపై న్యాయస్థానం కఠిన చర్యలకు ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







