మెయిడ్ హత్య: తల్లి, కుమార్తెకి జైలు
- February 03, 2018
యు.ఏ.ఈ:కల్బా క్రిమినల్ కోర్టు, గల్ఫ్ జాతీయురాలైన తల్లి, ఆమె కుమార్తెకు ఏడాది, ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బహిష్కరిస్తారు. తమ దగ్గర పనిచేస్తున్న మెయిడ్ని చిత్ర హింసలు పెట్టి, ఆమె మృతికి కారణమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిపై కేసు నమోదయ్యింది. నిందితుల భర్త, మెయిడ్కి స్పాన్సరర్. అతనికీ 3,000 దిర్హామ్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఏడాదిన్నరపాటు ఈ కేసు విచారణ జరిగింది. మృతురాలి కుటుంబం, నిందితులకు క్షమాభిక్ష పెట్టారు, బ్లడ్ మనీని అంగీకరించారు. కొన్నాళ్ళ క్రితం ఈ కేసు వెలుగు చూసింది. అంబులెన్స్ సాయం కోసం పోలీసులకు సమాచారం అందగా, అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందికి అక్కడ ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఆమె శరీరంపై తీవ్రగాయాలున్నట్లు సిబ్బంది గుర్తించి, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. విచారణలో, ఆమెపై విచక్షణా రహితంగా దాడి జరిగినట్లు తేలింది. అయితే స్పాన్సరర్ కుటుంబ సభ్యులు, వేధింపుల ఆరోపణల్ని కొట్టి పారేశారు. విచారణలో మాత్రం దాడి జరిగిందని నిరూపితం కావడంతో, నిందితులపై న్యాయస్థానం కఠిన చర్యలకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







