మెయిడ్ హత్య: తల్లి, కుమార్తెకి జైలు
- February 03, 2018
యు.ఏ.ఈ:కల్బా క్రిమినల్ కోర్టు, గల్ఫ్ జాతీయురాలైన తల్లి, ఆమె కుమార్తెకు ఏడాది, ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బహిష్కరిస్తారు. తమ దగ్గర పనిచేస్తున్న మెయిడ్ని చిత్ర హింసలు పెట్టి, ఆమె మృతికి కారణమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిపై కేసు నమోదయ్యింది. నిందితుల భర్త, మెయిడ్కి స్పాన్సరర్. అతనికీ 3,000 దిర్హామ్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఏడాదిన్నరపాటు ఈ కేసు విచారణ జరిగింది. మృతురాలి కుటుంబం, నిందితులకు క్షమాభిక్ష పెట్టారు, బ్లడ్ మనీని అంగీకరించారు. కొన్నాళ్ళ క్రితం ఈ కేసు వెలుగు చూసింది. అంబులెన్స్ సాయం కోసం పోలీసులకు సమాచారం అందగా, అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందికి అక్కడ ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఆమె శరీరంపై తీవ్రగాయాలున్నట్లు సిబ్బంది గుర్తించి, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. విచారణలో, ఆమెపై విచక్షణా రహితంగా దాడి జరిగినట్లు తేలింది. అయితే స్పాన్సరర్ కుటుంబ సభ్యులు, వేధింపుల ఆరోపణల్ని కొట్టి పారేశారు. విచారణలో మాత్రం దాడి జరిగిందని నిరూపితం కావడంతో, నిందితులపై న్యాయస్థానం కఠిన చర్యలకు ఆదేశించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి