గ్లోబల్ విలేజ్లో షేక్ మొహమ్మద్ సర్ప్రైజ్ విజిట్
- February 03, 2018
యు.ఏ.ఈ:యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ ఆకస్మికంగా దుబాయ్ గ్లోబల్ విలేజ్లో పర్యటించారు. విలేజ్కి చెందిన పలు పెవిలియన్స్ని ఆయన సందర్శించారు. 75 దేశాలకు చెందిన పార్టిసిపెంట్స్ ఈ విలేజ్లో పలు పెవిలియన్స్లో ఉన్నారు. కువైట్, యెమెనీ, సౌదీ అరేబియా, ఇండియా, థాయిలాండ్, పలు ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారి షాప్స్ ఇక్కడ ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్, ఎప్పటికప్పుడు సందర్శకుల్ని సరికొత్తగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు సుమారు 300,000 చదరపు మీటర్ల వైశాల్యంలో పలు రకాలైన షాపింగ్, ఎంటర్టైన్మెంట్, పెస్టివల్ ఈవెంట్స్తో సందర్శకుల్ని గ్లోబల్ ఫెస్టివల్ కనువిందు చేస్తోంది. కువైట్ పెవిలియన్ నుంచి ప్రారంభించిన షేక్ మొహమ్మద్, అక్కడి ప్రత్యేకతల్ని తెలుసుకున్నారు. యెమెనీ పెవిలియన్ సమా ఇతర పెవిలియన్లనూ సందర్శించి, అక్కడి విశేషాల్ని పరిశీలించారు. రెండు కీలోమీటర్ల మేర షేక్ మొహమ్మద్ టూర్ కొనసాగింది. గ్లోబల్ విలేజ్ నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







