గ్లోబల్ విలేజ్లో షేక్ మొహమ్మద్ సర్ప్రైజ్ విజిట్
- February 03, 2018
యు.ఏ.ఈ:యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ ఆకస్మికంగా దుబాయ్ గ్లోబల్ విలేజ్లో పర్యటించారు. విలేజ్కి చెందిన పలు పెవిలియన్స్ని ఆయన సందర్శించారు. 75 దేశాలకు చెందిన పార్టిసిపెంట్స్ ఈ విలేజ్లో పలు పెవిలియన్స్లో ఉన్నారు. కువైట్, యెమెనీ, సౌదీ అరేబియా, ఇండియా, థాయిలాండ్, పలు ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారి షాప్స్ ఇక్కడ ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్, ఎప్పటికప్పుడు సందర్శకుల్ని సరికొత్తగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు సుమారు 300,000 చదరపు మీటర్ల వైశాల్యంలో పలు రకాలైన షాపింగ్, ఎంటర్టైన్మెంట్, పెస్టివల్ ఈవెంట్స్తో సందర్శకుల్ని గ్లోబల్ ఫెస్టివల్ కనువిందు చేస్తోంది. కువైట్ పెవిలియన్ నుంచి ప్రారంభించిన షేక్ మొహమ్మద్, అక్కడి ప్రత్యేకతల్ని తెలుసుకున్నారు. యెమెనీ పెవిలియన్ సమా ఇతర పెవిలియన్లనూ సందర్శించి, అక్కడి విశేషాల్ని పరిశీలించారు. రెండు కీలోమీటర్ల మేర షేక్ మొహమ్మద్ టూర్ కొనసాగింది. గ్లోబల్ విలేజ్ నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









