గ్లోబల్ విలేజ్లో షేక్ మొహమ్మద్ సర్ప్రైజ్ విజిట్
- February 03, 2018
యు.ఏ.ఈ:యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ ఆకస్మికంగా దుబాయ్ గ్లోబల్ విలేజ్లో పర్యటించారు. విలేజ్కి చెందిన పలు పెవిలియన్స్ని ఆయన సందర్శించారు. 75 దేశాలకు చెందిన పార్టిసిపెంట్స్ ఈ విలేజ్లో పలు పెవిలియన్స్లో ఉన్నారు. కువైట్, యెమెనీ, సౌదీ అరేబియా, ఇండియా, థాయిలాండ్, పలు ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారి షాప్స్ ఇక్కడ ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్, ఎప్పటికప్పుడు సందర్శకుల్ని సరికొత్తగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు సుమారు 300,000 చదరపు మీటర్ల వైశాల్యంలో పలు రకాలైన షాపింగ్, ఎంటర్టైన్మెంట్, పెస్టివల్ ఈవెంట్స్తో సందర్శకుల్ని గ్లోబల్ ఫెస్టివల్ కనువిందు చేస్తోంది. కువైట్ పెవిలియన్ నుంచి ప్రారంభించిన షేక్ మొహమ్మద్, అక్కడి ప్రత్యేకతల్ని తెలుసుకున్నారు. యెమెనీ పెవిలియన్ సమా ఇతర పెవిలియన్లనూ సందర్శించి, అక్కడి విశేషాల్ని పరిశీలించారు. రెండు కీలోమీటర్ల మేర షేక్ మొహమ్మద్ టూర్ కొనసాగింది. గ్లోబల్ విలేజ్ నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి