ట్రిపుల్ ధమాకా తో అక్కినేని వారి కోడలు సమంత
- February 03, 2018
అక్కినేని వారి కోడలు సమంత ఈసారి ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతుంది. సమంత నటించిన మూడు సినిమాలు.. ఒక్క రోజు గ్యాప్లో విడుదలకు ముస్తాబవుతున్నాయి.
విశాల్-సమంత హీరో హీరోయిన్స్గా తమిళంలో రూపొందిన 'ఇరుంబు తిరై' తెలుగులో 'అభిమన్యుడు'గా అనువాదమయ్యింది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్గా అలరించబోతున్నాడు. ఇప్పటికే టీజర్తో ఆకట్టుకున్న ఈ సినిమా సంక్రాంత్రికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ఈ చిత్రాన్ని రెండు భాషల్లోనూ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ ప్రకటించాడు ప్రొడ్యూసర్ కమ్ హీరో విశాల్. ఈ చిత్రాన్ని మార్చి 29న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
మార్చి 29నే సమంత నటిస్తోన్న సావిత్రి బయోపిక్ 'మహానటి' కూడా విడుదల కానుంది. ఇక మెగా పవర్స్టార్ రామ్చరణ్తో మొదటిసారి సామ్ నటిస్తోన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ 'రంగస్థలం-1985' మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సమంత నటిస్తోన్న మూడు సినిమాలు ఒక్క రోజు గ్యాప్లో ఆడియెన్స్ను అలరించబోతున్నాయన్నమాట. మరి ఈ మూడు చిత్రాలతో అక్కినేని వారి కోడలు ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







