కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్..
- February 19, 2018
మోడీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏపీకి విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నిలదీయడానికి అవిశ్వాసమే సరైన మార్గమనుకొంటోంది కాంగ్రెస్. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం.. వైఎస్ జగన్ కూడా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దీనిపై చర్చించడం రాజకీయాల్లో హీట్ పెంచింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. మార్చి 5 నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో, ఆ లోపే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







