ఓమారియాలో సొంత సోదరడినే ఏ కె 47 తో కాల్చి చంపిన దుర్మార్గుడు
- March 03, 2018
కువైట్: కొందరు దుర్మార్గులు పట్టరాని ఆగ్రహాలతో ..ఉన్మాదులుగా మారి రక్త సంబంధీకులనే రాక్షసంగా అంతమొందిస్తున్నారు శుక్రవారం ఓమారియాలో జరిగిన ఒక దారుణ ఘటనలో సొంత సోదరడినే ఏ కె 47 తో తలపై కాల్చి చంపి అక్కడినుంచి పరారైయ్యాడు ఓ దుర్మార్గుడు . కాల్పులకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. దాంతో వారు వెంటనే స్పందించి నేరం జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. తలలోనికి పలు బులెట్లు దూసుకుపోవడంతో బాధితుడు ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. హంతకుడు గతంలో ఒక నేరంలో నిందితుడు కాగా శిక్షను అనుభవించి వారం రోజుల ముందు జైలు నుండి విడుదలైనట్లు అపరాధ పరిశోధకులు కనుగొన్నారు. సోదరుడిని దారుణంగా చంపిన తర్వాత ఒక కారులో పరారవుతున్న హంతకుడి వాహనంలో అకస్మాత్తుగా ఇంధనం అయిపోవడంతో కారు ఆగిపోయింది. దీంతో వెతుకుతున్న పోలీసులకు నిందితుడు సులువుగా దొరికిపోవడంతో అరెస్టు చేశారు. హంతకుని వద్ద హత్య ఆయుధాలను పోలీసులు కనుగొన్నారు. ఏకే 47 గన్ కారులో లభించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క సంబంధాలు మరియు భద్రతా సమాచార విభాగం తెలిపింది. నిందితుడు తన కుటుంబ సభ్యులను శారీరకంగా హింసించే నేరానికి పాల్పడిన వ్యక్తి అని ఆ కేసులో జైలు శిక్ష సైతం అనుభవించాడని తెలిసింది. నిందితుడిపై తదుపరి చర్య కోసం సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!







