ఓమారియాలో సొంత సోదరడినే ఏ కె 47 తో కాల్చి చంపిన దుర్మార్గుడు
- March 03, 2018
కువైట్: కొందరు దుర్మార్గులు పట్టరాని ఆగ్రహాలతో ..ఉన్మాదులుగా మారి రక్త సంబంధీకులనే రాక్షసంగా అంతమొందిస్తున్నారు శుక్రవారం ఓమారియాలో జరిగిన ఒక దారుణ ఘటనలో సొంత సోదరడినే ఏ కె 47 తో తలపై కాల్చి చంపి అక్కడినుంచి పరారైయ్యాడు ఓ దుర్మార్గుడు . కాల్పులకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. దాంతో వారు వెంటనే స్పందించి నేరం జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. తలలోనికి పలు బులెట్లు దూసుకుపోవడంతో బాధితుడు ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. హంతకుడు గతంలో ఒక నేరంలో నిందితుడు కాగా శిక్షను అనుభవించి వారం రోజుల ముందు జైలు నుండి విడుదలైనట్లు అపరాధ పరిశోధకులు కనుగొన్నారు. సోదరుడిని దారుణంగా చంపిన తర్వాత ఒక కారులో పరారవుతున్న హంతకుడి వాహనంలో అకస్మాత్తుగా ఇంధనం అయిపోవడంతో కారు ఆగిపోయింది. దీంతో వెతుకుతున్న పోలీసులకు నిందితుడు సులువుగా దొరికిపోవడంతో అరెస్టు చేశారు. హంతకుని వద్ద హత్య ఆయుధాలను పోలీసులు కనుగొన్నారు. ఏకే 47 గన్ కారులో లభించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క సంబంధాలు మరియు భద్రతా సమాచార విభాగం తెలిపింది. నిందితుడు తన కుటుంబ సభ్యులను శారీరకంగా హింసించే నేరానికి పాల్పడిన వ్యక్తి అని ఆ కేసులో జైలు శిక్ష సైతం అనుభవించాడని తెలిసింది. నిందితుడిపై తదుపరి చర్య కోసం సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







