ఈ నెల 29న 'ఇరుంబు తిరై' విడుదల సన్నాహాలు
- March 03, 2018విశాల్ హీరోగా సొంత బ్యానరు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న చిత్రం 'ఇరుంబు తిరై'. మిత్రన్ దర్శకత్వంలోని ఈ సినిమాలో సమంత కథానాయిక. అర్జున్ విలన్ పాత్ర పోషించారు. విశాల్ గురువు అర్జున్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా వాణిజ్య పనులు ఊపందుకున్నాయి. కేరళ మార్కెట్కు సంబంధించిన హక్కులను శిబు తమీమ్ సొంతం చేసుకున్నారు. విజయ్ నటించిన 'పులి', విక్రం నటించిన 'ఇరుముగన్' చిత్రాలను గతంలో నిర్మించారు శిబు. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విక్రం నటిస్తున్న 'సామి స్క్వేర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశాల్కు కేరళలో మార్కెట్ బాగుంది. అందుకే మరింత గ్రాండ్గా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు తమిళంలో కూడా పంపిణీ పనులు ఆరంభమయ్యాయి. మార్చి 29వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు.a
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..