నాగ అన్వేష్ కొత్త మూవీ ప్రారంభం
- March 04, 2018
యువ కథానాయకుడు నాగ అన్వేష్ నటిస్తున్న కొత్త చిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో ప్రారంభోత్సవం జరుపుకుంది. గణష్ క్రియేషన్స్ పతాకంపై లండన్ గణేష్, సీహెచ్వీ నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్డూడియోలో ఏ నిమిషానికి ఏమి జరుగునో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశం అనంతరం నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ.లండన్ నివాసిని కాబట్టి లండన్ గణష్ అంటారు. డిసెంబర్లో ఈ సినిమా బృందాన్ని కలిశాను. మా దర్శకుడు మంచి కథతో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె మాట్లాడుతూ.సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆదిత్య 369, పుష్పక విమానం తరహాలో ఉంటుంది. మూడు పాటలుంటాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు. కథానాయకుడు నాగ అన్వేష్ మాట్లాడుతూ.చాలా కొత్త తరహా కథ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముగింపు వరకు ఏ జరుగుతుందో కథ విన్న నాకే అర్థం కాలేదు. ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుంది. ముహూర్తం బాగుందని చిత్రాన్ని ప్రారంభించాం. వచ్చే నెల చిత్రీకరణ ఉంటుంది. అన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









