నాగ అన్వేష్ కొత్త మూవీ ప్రారంభం
- March 04, 2018
యువ కథానాయకుడు నాగ అన్వేష్ నటిస్తున్న కొత్త చిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో ప్రారంభోత్సవం జరుపుకుంది. గణష్ క్రియేషన్స్ పతాకంపై లండన్ గణేష్, సీహెచ్వీ నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్డూడియోలో ఏ నిమిషానికి ఏమి జరుగునో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశం అనంతరం నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ.లండన్ నివాసిని కాబట్టి లండన్ గణష్ అంటారు. డిసెంబర్లో ఈ సినిమా బృందాన్ని కలిశాను. మా దర్శకుడు మంచి కథతో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె మాట్లాడుతూ.సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆదిత్య 369, పుష్పక విమానం తరహాలో ఉంటుంది. మూడు పాటలుంటాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు. కథానాయకుడు నాగ అన్వేష్ మాట్లాడుతూ.చాలా కొత్త తరహా కథ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముగింపు వరకు ఏ జరుగుతుందో కథ విన్న నాకే అర్థం కాలేదు. ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుంది. ముహూర్తం బాగుందని చిత్రాన్ని ప్రారంభించాం. వచ్చే నెల చిత్రీకరణ ఉంటుంది. అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







