నాగ అన్వేష్ కొత్త మూవీ ప్రారంభం
- March 04, 2018
యువ కథానాయకుడు నాగ అన్వేష్ నటిస్తున్న కొత్త చిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో ప్రారంభోత్సవం జరుపుకుంది. గణష్ క్రియేషన్స్ పతాకంపై లండన్ గణేష్, సీహెచ్వీ నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్డూడియోలో ఏ నిమిషానికి ఏమి జరుగునో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశం అనంతరం నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ.లండన్ నివాసిని కాబట్టి లండన్ గణష్ అంటారు. డిసెంబర్లో ఈ సినిమా బృందాన్ని కలిశాను. మా దర్శకుడు మంచి కథతో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె మాట్లాడుతూ.సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆదిత్య 369, పుష్పక విమానం తరహాలో ఉంటుంది. మూడు పాటలుంటాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు. కథానాయకుడు నాగ అన్వేష్ మాట్లాడుతూ.చాలా కొత్త తరహా కథ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముగింపు వరకు ఏ జరుగుతుందో కథ విన్న నాకే అర్థం కాలేదు. ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుంది. ముహూర్తం బాగుందని చిత్రాన్ని ప్రారంభించాం. వచ్చే నెల చిత్రీకరణ ఉంటుంది. అన్నారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







