237 మంది అక్రమ వలసదారులను రక్షించిన లిబియా నౌకాదళ సిబ్బంది
- March 11, 2018
ట్రిపోలీ: లిబియా వైపు అక్రమంగా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన బోటులో వున్న దాదాపు 237 మందిని తమ నౌకాదళ సిబ్బంది సురక్షితంగా తీరానికి చేర్చారని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. లిబియా వైపు రెండు బోట్లలో అక్రమంగా తరలి వస్తున్న దాదాపు 237 మంది ప్రయాణీకులను లిబియాలోని అజ్ జవాఇయా తీర ప్రాంతంలో నీట మునగకుండా సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికార అనడోలు వార్తా సంస్థ వెల్లడించింది. 44 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులతో వున్న ఈ వసలదారుల బృందంలో అధికశాతంమంది ఆఫ్రికాకు చెందిన వారేనని, ఒకరిద్దరు బంగ్లాదేశ్కు చెందిన వారుండవచ్చని ఈ ప్రకటనలో వివరించారు. వారికి వైద్య సదుపాయంతో పాటు అవసరమైన మానవతా సాయం కూడా అందచేస్తున్నామని ఈ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







