ప్రాస్టిట్యూషన్, ట్రాఫికింగ్ కేసుల్లో 240 వలసదారుల అరెస్ట్
- March 12, 2018
మస్కట్: మొత్తం 199 మంది మహిళలు, 48 మంది పురుషుల్ని వ్యభిచారం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. బౌషర్లోని పలు ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించడం జరిగింది. బౌషర్లో 247 మందిని ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేరంలో అరెస్ట్ చేశామనీ, అందులో 199 మంది మహిళలు కాగా, 48 మంది పురుషులనీ, వీరంతా ఆసియా మరియు ఆఫ్రికాకి చెందిన జాతీయులనీ పోలీసులు వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - మస్కట్, క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, బౌషర్ పోలీస్ స్టేషన్ మరియు స్పెసల్ ఫోర్సెస్ పోలీస్ కమాండ్ - మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, బౌషర్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అక్రమ చొరబాట్లు, రెసిడెన్స్ చట్టాన్ని ఉల్లంఘించడం, ఫ్రాడ్ తదితర కేసుల్లోనూ వీరిని నిందితులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







