న్యూజిలాండ్లో ఎగిరే టాక్సీలు!
- March 15, 2018
న్యూజిలాండ్లో పైలట్ రహిత ఎగిరే టాక్సీలను పరీక్షిస్తున్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ఈ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారు. ఈ ట్యాక్సీలతో ప్రజా రవాణా రంగంలో విప్లవం వస్తుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. పేజ్ కంపెనీ కిట్లీ హాక్ అనుబంధ సంస్థ అయిన జిఫిర్ ఎయిర్వర్క్స్ ఎయిర్ ట్యాక్సీలను అభివృద్ధిపరిచి, పరీక్షించే ప్రణాళికకు న్యూజిలాండ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. కోరాగా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్కు రెక్కలపై చిన్న లిఫ్ట్ రూటర్లు వుంటాయి. దీంతో, ఈ ఎయిర్క్రాఫ్ట్ నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోగలుగుతుంది. హెలికాప్టర్ మాదిరిగా ల్యాండ్ అవుతుంది. పట్టణప్రాంతాల్లో ఇండ్ల పైకప్పులను, కార్ పార్కింగ్ ప్రాంతాలను ల్యాండింగ్ పాడ్లుగా ఉపయోగించుకుంటూ అక్కడ మాత్రమే ప్రయాణికులను రవాణా చేయగలుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఈ టాక్సీల నుండి ఎలాంటి కాలుష్యం వెలువడదని, రవాణా రంగంలో ఇదొక అద్భుతమైన దశ అని జిఫిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెడ్ రెయిడ్ చెప్పారు. కోరా నమూనాను న్యూజీలాండ్లోని దక్షిణ దీవిలో పరీక్షిస్తున్నారు. ఈ వాహనంలో మూడు కంప్యూటర్లు వుండి ప్రయాణ మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఎగిరే టాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







