ఆస్ట్రేలియాతో సిరీస్లో టీమిండియా ఉమెన్స్ టీమ్కు వైట్వాష్
- March 18, 2018
వడోదరా: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకుందామని భావించిన భారత మహిళలకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఫలితంగా భారత్కు వైట్వాష్ తప్పలేదు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 333 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. ఓపెనర్ అలైస్సా హేలీ(133) సెంచరీతో సత్తా చాటగా, రాచెల్ హేన్స్(43), ఎల్లీసే పెర్రీ(32), బెత్ మూనీ(34), గార్డ్నర్(35)లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది.
ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 44.4 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్(42), స్మృతీ మంధాన(52)లు ఆకట్టుకుని తొలి వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్కు చేరడంతో భారత్ తడబాటుకు లోనైంది. ఆ తర్వాత మిథాలీ రాజ్(21), హర్మన్ ప్రీత్ కౌర్(25)లు ఆశించిన స్థాయిలో రాణించకపోగా, దీప్తి శర్మ(36), సుష్మా వర్మ(30)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ 221 పరుగుల స్కోరు వద్ద వరుసగా అవుట్ కావడంతో పాటు చివరి వరుస క్రీడాకారిణులు ఎవరూ రాణించకపోవడంతో భారత్కు భారీ ఓటమి తప్పలేదు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









