ఆస్ట్రేలియాతో సిరీస్లో టీమిండియా ఉమెన్స్ టీమ్కు వైట్వాష్
- March 18, 2018
వడోదరా: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకుందామని భావించిన భారత మహిళలకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఫలితంగా భారత్కు వైట్వాష్ తప్పలేదు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 333 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. ఓపెనర్ అలైస్సా హేలీ(133) సెంచరీతో సత్తా చాటగా, రాచెల్ హేన్స్(43), ఎల్లీసే పెర్రీ(32), బెత్ మూనీ(34), గార్డ్నర్(35)లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది.
ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 44.4 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్(42), స్మృతీ మంధాన(52)లు ఆకట్టుకుని తొలి వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్కు చేరడంతో భారత్ తడబాటుకు లోనైంది. ఆ తర్వాత మిథాలీ రాజ్(21), హర్మన్ ప్రీత్ కౌర్(25)లు ఆశించిన స్థాయిలో రాణించకపోగా, దీప్తి శర్మ(36), సుష్మా వర్మ(30)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ 221 పరుగుల స్కోరు వద్ద వరుసగా అవుట్ కావడంతో పాటు చివరి వరుస క్రీడాకారిణులు ఎవరూ రాణించకపోవడంతో భారత్కు భారీ ఓటమి తప్పలేదు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







