తప్పులు జరిగాయి..ఫేస్బుక్ సిఇవో జుకెర్
- March 21, 2018
వాషింగ్టన్ : తన కంపెనీలోని 50 మిలియన్ వినియోగదారుల వివరాల సమీకరణలో తప్పులు జరిగాయని ఫేస్బుక్ లింక్స్ నిర్వాహకుడు మార్క్ జుకెర్బర్గ్ అంగీకరించారు. అలాంటి సమాచారాన్ని అభివృద్ధి చేసే వారి యాక్సెస్ను పరిమితం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత నాలుగు రోజులుగా ఫేస్బుక్పై పలు వివాదాంశ వార్తలు రావడంతో ఫేస్బుక్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ జుకెర్బర్గ్ స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్మీడియా ఫేస్బుక్ నెట్వర్క్పై విజిల్బోయర్ ఆరోపణల నేపథ్యంలో ఐరోపా, అమెరికా దేశాల ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్నారు. ఫేస్బుక్ సంస్థ ట్రంప్ కనెక్ట్ అయిన డేటా మైనింగ్ సంస్థతో కూడిన కుంభకోణంలో వినియోగదారుల డేటాను రక్షించడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామన్నారు. లండన్లోని 'కేంబ్రిడ్జ్ ఎనలిటికా సాగా' నుండి డేటాను రక్షించే బాధ్యత తమకుందని, అది విఫలమైతే తాము సేవ చేయటానికి అర్హత కోల్పోతామని జుకెర్బర్గ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









