తప్పులు జరిగాయి..ఫేస్బుక్ సిఇవో జుకెర్
- March 21, 2018
వాషింగ్టన్ : తన కంపెనీలోని 50 మిలియన్ వినియోగదారుల వివరాల సమీకరణలో తప్పులు జరిగాయని ఫేస్బుక్ లింక్స్ నిర్వాహకుడు మార్క్ జుకెర్బర్గ్ అంగీకరించారు. అలాంటి సమాచారాన్ని అభివృద్ధి చేసే వారి యాక్సెస్ను పరిమితం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత నాలుగు రోజులుగా ఫేస్బుక్పై పలు వివాదాంశ వార్తలు రావడంతో ఫేస్బుక్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ జుకెర్బర్గ్ స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్మీడియా ఫేస్బుక్ నెట్వర్క్పై విజిల్బోయర్ ఆరోపణల నేపథ్యంలో ఐరోపా, అమెరికా దేశాల ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్నారు. ఫేస్బుక్ సంస్థ ట్రంప్ కనెక్ట్ అయిన డేటా మైనింగ్ సంస్థతో కూడిన కుంభకోణంలో వినియోగదారుల డేటాను రక్షించడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామన్నారు. లండన్లోని 'కేంబ్రిడ్జ్ ఎనలిటికా సాగా' నుండి డేటాను రక్షించే బాధ్యత తమకుందని, అది విఫలమైతే తాము సేవ చేయటానికి అర్హత కోల్పోతామని జుకెర్బర్గ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







