మ్వసలాత్ బస్సులకు పెరుగుతున్న ఆదరణ
- December 01, 2015
మస్కట్లో ప్రయాణీకులకు లగ్జరియస్ జర్నీ తక్కువ ఖరీదుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్వసలాత్ తీసుకొచ్చిన కొత్త బస్సులు ప్రయాణీకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ బస్సులు లగ్జరియస్ జర్నీని అందిస్తున్నాయని ప్రయాణీకులు అంటున్నారు. ట్యాక్సీని ఆశ్రయిస్తే 800 బైజా ఖర్చయ్యేదనీ, అదే ఈ బస్సుల్లో ప్రయాణం కేవలం 300 బైజాకే అందుతోందని ప్రయాణీకులు చెప్పారు. అయితే ప్రయాణీకుల వాదనలకు భిన్నంగా ట్యాక్సీ డ్రైవర్లు మ్వసలాత్ బస్సులపై తమ ఆవేదనను చెబుతున్నారు. ఈ బస్సుల రాకతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, ట్యాక్సీ నడపడం ద్వారా తమ తమ కుటుంబాల్ని నడుపుతున్న తమకు, ప్రయాణీకులు లేక ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఉచితంగా బస్సులు నడిపిన మ్వసలాత్ ఇక నుంచి ఛార్జీలను వసూలు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









