మ్వసలాత్ బస్సులకు పెరుగుతున్న ఆదరణ
- December 01, 2015
మస్కట్లో ప్రయాణీకులకు లగ్జరియస్ జర్నీ తక్కువ ఖరీదుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్వసలాత్ తీసుకొచ్చిన కొత్త బస్సులు ప్రయాణీకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ బస్సులు లగ్జరియస్ జర్నీని అందిస్తున్నాయని ప్రయాణీకులు అంటున్నారు. ట్యాక్సీని ఆశ్రయిస్తే 800 బైజా ఖర్చయ్యేదనీ, అదే ఈ బస్సుల్లో ప్రయాణం కేవలం 300 బైజాకే అందుతోందని ప్రయాణీకులు చెప్పారు. అయితే ప్రయాణీకుల వాదనలకు భిన్నంగా ట్యాక్సీ డ్రైవర్లు మ్వసలాత్ బస్సులపై తమ ఆవేదనను చెబుతున్నారు. ఈ బస్సుల రాకతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, ట్యాక్సీ నడపడం ద్వారా తమ తమ కుటుంబాల్ని నడుపుతున్న తమకు, ప్రయాణీకులు లేక ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఉచితంగా బస్సులు నడిపిన మ్వసలాత్ ఇక నుంచి ఛార్జీలను వసూలు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







