మ్వసలాత్ బస్సులకు పెరుగుతున్న ఆదరణ
- December 01, 2015
మస్కట్లో ప్రయాణీకులకు లగ్జరియస్ జర్నీ తక్కువ ఖరీదుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్వసలాత్ తీసుకొచ్చిన కొత్త బస్సులు ప్రయాణీకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ బస్సులు లగ్జరియస్ జర్నీని అందిస్తున్నాయని ప్రయాణీకులు అంటున్నారు. ట్యాక్సీని ఆశ్రయిస్తే 800 బైజా ఖర్చయ్యేదనీ, అదే ఈ బస్సుల్లో ప్రయాణం కేవలం 300 బైజాకే అందుతోందని ప్రయాణీకులు చెప్పారు. అయితే ప్రయాణీకుల వాదనలకు భిన్నంగా ట్యాక్సీ డ్రైవర్లు మ్వసలాత్ బస్సులపై తమ ఆవేదనను చెబుతున్నారు. ఈ బస్సుల రాకతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, ట్యాక్సీ నడపడం ద్వారా తమ తమ కుటుంబాల్ని నడుపుతున్న తమకు, ప్రయాణీకులు లేక ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఉచితంగా బస్సులు నడిపిన మ్వసలాత్ ఇక నుంచి ఛార్జీలను వసూలు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







