మ్వసలాత్ బస్సులకు పెరుగుతున్న ఆదరణ
- December 01, 2015
మస్కట్లో ప్రయాణీకులకు లగ్జరియస్ జర్నీ తక్కువ ఖరీదుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్వసలాత్ తీసుకొచ్చిన కొత్త బస్సులు ప్రయాణీకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ బస్సులు లగ్జరియస్ జర్నీని అందిస్తున్నాయని ప్రయాణీకులు అంటున్నారు. ట్యాక్సీని ఆశ్రయిస్తే 800 బైజా ఖర్చయ్యేదనీ, అదే ఈ బస్సుల్లో ప్రయాణం కేవలం 300 బైజాకే అందుతోందని ప్రయాణీకులు చెప్పారు. అయితే ప్రయాణీకుల వాదనలకు భిన్నంగా ట్యాక్సీ డ్రైవర్లు మ్వసలాత్ బస్సులపై తమ ఆవేదనను చెబుతున్నారు. ఈ బస్సుల రాకతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, ట్యాక్సీ నడపడం ద్వారా తమ తమ కుటుంబాల్ని నడుపుతున్న తమకు, ప్రయాణీకులు లేక ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఉచితంగా బస్సులు నడిపిన మ్వసలాత్ ఇక నుంచి ఛార్జీలను వసూలు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







