డ్రగ్స్ స్మగ్లింగ్: నిందితుడికి ఐదేళ్ళ జైలు
- March 26, 2018
మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్, బహ్రెయినీ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్షను అలాగే, 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని విధించింది. పాకిస్తాన్ నుంచి పచ్చడి జాడీల్లో డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. 22 ఏళ్ళ నిందితుడ్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు మార్చి 28న అరెస్ట్ చేయడంతో డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడి అనుమానాస్పద వైఖరిని గుర్తించిన పోలీసులు, అతన్ని తనిఖీ చేయగా, 180 గ్రాముల మెథాంఫెటమైన్ (షాబుగా వ్యవహరిస్తారు) అతని వద్ద గుర్తించారు. నాలుగేళ్ళుగా ఈ డ్రగ్స్ని తాను వాడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పాకిస్తాన్లో తక్కువ ధరకే దొరికే ఆ డ్రగ్కి బహ్రెయిన్లో చాలా ధర పలుకుతోందని గమనించి, స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







