డ్రగ్స్ స్మగ్లింగ్: నిందితుడికి ఐదేళ్ళ జైలు
- March 26, 2018
మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్, బహ్రెయినీ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్షను అలాగే, 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని విధించింది. పాకిస్తాన్ నుంచి పచ్చడి జాడీల్లో డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. 22 ఏళ్ళ నిందితుడ్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు మార్చి 28న అరెస్ట్ చేయడంతో డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడి అనుమానాస్పద వైఖరిని గుర్తించిన పోలీసులు, అతన్ని తనిఖీ చేయగా, 180 గ్రాముల మెథాంఫెటమైన్ (షాబుగా వ్యవహరిస్తారు) అతని వద్ద గుర్తించారు. నాలుగేళ్ళుగా ఈ డ్రగ్స్ని తాను వాడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పాకిస్తాన్లో తక్కువ ధరకే దొరికే ఆ డ్రగ్కి బహ్రెయిన్లో చాలా ధర పలుకుతోందని గమనించి, స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









