డ్రగ్స్ స్మగ్లింగ్: నిందితుడికి ఐదేళ్ళ జైలు
- March 26, 2018
మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్, బహ్రెయినీ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్షను అలాగే, 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని విధించింది. పాకిస్తాన్ నుంచి పచ్చడి జాడీల్లో డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. 22 ఏళ్ళ నిందితుడ్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు మార్చి 28న అరెస్ట్ చేయడంతో డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడి అనుమానాస్పద వైఖరిని గుర్తించిన పోలీసులు, అతన్ని తనిఖీ చేయగా, 180 గ్రాముల మెథాంఫెటమైన్ (షాబుగా వ్యవహరిస్తారు) అతని వద్ద గుర్తించారు. నాలుగేళ్ళుగా ఈ డ్రగ్స్ని తాను వాడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పాకిస్తాన్లో తక్కువ ధరకే దొరికే ఆ డ్రగ్కి బహ్రెయిన్లో చాలా ధర పలుకుతోందని గమనించి, స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









