హెచ్ఐవీపై సమరానికి ఒమన్ న్యూ ప్లాన్

- December 01, 2015 , by Maagulf
హెచ్ఐవీపై సమరానికి ఒమన్ న్యూ ప్లాన్


ప్రపంచ మానవాళికి పెను సవాల్గా మారిన హెచ్ఐవీ నియంత్రణకు వివిధ దేశాలు తమవంతుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఒమన్ ప్రభుత్వం కూడా జాతీయ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. 2016 నాటికి తమ దేశంలో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిసీజ్ సర్విలెన్స్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైఫ్ అల్ అబ్రి ఈ విషయాన్ని ప్రకటించారు. సీనియర్ అధికారులు, మెడికల్ ప్రొఫెషనల్స్ కలిసి సుమారుగా 200 మందితో ఓ సమావేశాన్ని నిర్వహించి, హెచ్ఐవి ఎయిడ్స్పై పోరాటంలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 2020 నాటికి 90-90-90 అనే టార్గెట్తో పనిచేయనున్నట్లు డాక్టర్ అబ్రి చెప్పారు. ఈ టార్గెట్ ఉద్దేశ్యమేంటంటే 2020 నాటికి హెచ్ఐవి సోకినవారిలో 90 శాతం మంది తమకు ఆ వైరస్ సోకిందని తెలుసుకునేలా చేయడం, 90 శాతం మంది వ్యాధిగ్రస్తులు వైద్య చికిత్స అందుకునేలా చేయడం, 90 శాతం మందిలో హెచ్ఐవి వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టేలా చేయడం. నేషనల్ టీబీ ఎయిడ్స్ మరియు లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ మొహమ్మద్ రెదా మూసా అల్ లవాతి మాట్లాడుతూ, న్యూ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాల్సి ఉందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com