వార్నర్ బ్రదర్స్ పార్క్ జులై 25న ప్రారంభం
- April 18, 2018అబుదాబీ వార్నర్ బ్రదర్స్ వరల్డ్, జులై 25 నుంచి సందర్శకులను అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు నిర్వాహకులు. డిసి మెట్రోపోలిస్, గోథామ్ సిటీ, కార్టూన్ జంక్షన్, బెడ్రాక్, డైనమైట్ గల్చ్, వార్నర్ బ్రదర్స్ ప్లాజా వంటి ఆకర్షణలు ఇందులో వున్నాయి. 1.65 మిలియన్ స్కేర్ ఫీట్ వైశాల్యంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్లో ప్రపంచ ప్రఖ్యాత ఐకానిక్ క్యారెక్టర్స్ని, స్టోరీస్నీ సందర్శకుల కోసం పొందుపర్చారు. 29 రైడ్స్, లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈ పార్క్లో ప్రధాన ఆకర్షణలు. రీజియన్లో ఈ తరహా పార్క్ ఇదే తొలిసారి. 1 బిలియన్ డాలర్స్ ఖర్చుతో పార్క్ని ఏర్పాటు చేసినట్లు డెవలపర్ మిరాల్ సంస్థ ఛైర్మన్ అల్ ముబారక్ చెప్పారు. బ్యాట్మెన్, సూపర్ మేన్, వండర్ విమెన్, బగ్స్ బన్నీ, విల్ ఇ కోయెటో, స్కూబీ డూ వంటివి తమ జీవితంలోకి వచ్చిన అనుభూతిని సందర్శకులు పొందే వీలుంది ఈ పార్క్లో.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్