వార్నర్ బ్రదర్స్ పార్క్ జులై 25న ప్రారంభం
- April 18, 2018
అబుదాబీ వార్నర్ బ్రదర్స్ వరల్డ్, జులై 25 నుంచి సందర్శకులను అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు నిర్వాహకులు. డిసి మెట్రోపోలిస్, గోథామ్ సిటీ, కార్టూన్ జంక్షన్, బెడ్రాక్, డైనమైట్ గల్చ్, వార్నర్ బ్రదర్స్ ప్లాజా వంటి ఆకర్షణలు ఇందులో వున్నాయి. 1.65 మిలియన్ స్కేర్ ఫీట్ వైశాల్యంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్లో ప్రపంచ ప్రఖ్యాత ఐకానిక్ క్యారెక్టర్స్ని, స్టోరీస్నీ సందర్శకుల కోసం పొందుపర్చారు. 29 రైడ్స్, లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈ పార్క్లో ప్రధాన ఆకర్షణలు. రీజియన్లో ఈ తరహా పార్క్ ఇదే తొలిసారి. 1 బిలియన్ డాలర్స్ ఖర్చుతో పార్క్ని ఏర్పాటు చేసినట్లు డెవలపర్ మిరాల్ సంస్థ ఛైర్మన్ అల్ ముబారక్ చెప్పారు. బ్యాట్మెన్, సూపర్ మేన్, వండర్ విమెన్, బగ్స్ బన్నీ, విల్ ఇ కోయెటో, స్కూబీ డూ వంటివి తమ జీవితంలోకి వచ్చిన అనుభూతిని సందర్శకులు పొందే వీలుంది ఈ పార్క్లో.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









