వార్నర్ బ్రదర్స్ పార్క్ జులై 25న ప్రారంభం
- April 18, 2018
అబుదాబీ వార్నర్ బ్రదర్స్ వరల్డ్, జులై 25 నుంచి సందర్శకులను అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు నిర్వాహకులు. డిసి మెట్రోపోలిస్, గోథామ్ సిటీ, కార్టూన్ జంక్షన్, బెడ్రాక్, డైనమైట్ గల్చ్, వార్నర్ బ్రదర్స్ ప్లాజా వంటి ఆకర్షణలు ఇందులో వున్నాయి. 1.65 మిలియన్ స్కేర్ ఫీట్ వైశాల్యంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్లో ప్రపంచ ప్రఖ్యాత ఐకానిక్ క్యారెక్టర్స్ని, స్టోరీస్నీ సందర్శకుల కోసం పొందుపర్చారు. 29 రైడ్స్, లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈ పార్క్లో ప్రధాన ఆకర్షణలు. రీజియన్లో ఈ తరహా పార్క్ ఇదే తొలిసారి. 1 బిలియన్ డాలర్స్ ఖర్చుతో పార్క్ని ఏర్పాటు చేసినట్లు డెవలపర్ మిరాల్ సంస్థ ఛైర్మన్ అల్ ముబారక్ చెప్పారు. బ్యాట్మెన్, సూపర్ మేన్, వండర్ విమెన్, బగ్స్ బన్నీ, విల్ ఇ కోయెటో, స్కూబీ డూ వంటివి తమ జీవితంలోకి వచ్చిన అనుభూతిని సందర్శకులు పొందే వీలుంది ఈ పార్క్లో.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







