400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై..!!
- June 07, 2018దేశవ్యాప్తంగా ఉన్న 400 రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలు అందించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. రైల్టెల్ సహకారంతో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఈరోజు అసోంలోని దిబ్రుగఢ్ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై ని ఏర్పాటు చేశారు. దీంతో ఇక దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఈ వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చిందని గూగుల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2016 జనవరిలో ఈ ఉచిత వైఫై సేవలకు శ్రీకారం చుట్టారు. రైల్వేశాఖకు చెందిన టెలికాం విభాగం రైల్టెల్ సహాకారంతో గూగుల్ రైల్వేస్టేషన్లలో వైఫై రూటర్లను ఏర్పాటుచేస్తోంది. మొదటిసారి ముంబై సెంట్రల్ స్టేషన్లో ఈ ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రాజెక్టును చేపట్టిన ఏడాది కాలంలోనే 100 పెద్ద రైల్వేస్టేషన్లలో వైఫైను ఏర్పాటుచేశారు.ఇప్పుడది 400కు చేరింది. దీంతో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు