దుబాయ్:ఎయిర్ పోర్ట్ వినియోగదారులకి రోడ్ క్లోజర్ హెచ్చరిక
- June 07, 2018దుబాయ్: దుబాయ్ ఎయిర్పోర్ట్స్ అధికారులు, ట్రావెలర్స్కి రోడ్ క్లోజర్స్పై హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు టెర్మినల్ 1 నుంచి గర్హౌడ్ లేదా దుబాయ్ వెళ్ళే రహదారిపై బ్రిడ్జి మూసివేయబడ్తుంది. కొత్త గాంట్రే రోడ్ సైన్ ఏర్పాటు కోసం ఈ రోడ్డుని మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించుకుని విమాన ప్రయాణీకులు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలని పేర్కొంది. రష్దియా వైపుగా రోడ్ సైన్స్ని ఫాలో అవ్వాల్సి వుంటుంది. టెర్మినల్ 1 నుంచి ఎగ్జిట్ అయ్యాక, ఈ రోడ్ సైన్స్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. విలా 41తొ స్ట్రీట్, కసబ్లాంకా స్ట్రీట్ నార్త్ బౌండ్, ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని ఎయిర్ పోర్ట్ రోడ్ని వినియోగించుకుని కసబ్లాంకా సౌత్ బౌండ్ నుంచి వెళ్ళాలి. రోడ్డు మూసివేత దాదాపుగా 4 గంటల పాటు అమల్లో వుంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రోడ్డు యాక్సెస్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు