యూఎస్ ఓపెన్ ప్రైజ్మనీ రూ. 26 కోట్లు
- July 20, 2018
యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 38 లక్షల డాలర్లు (రూ.26 కోట్లు) పొందవచ్చు. నిర్వాహకులు సింగిల్స్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్మనీని భారీగా పెంచారు. గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్మనీ కావడం విశేషం. కేవలం మెయిన్ డ్రా కు అర్హత సాధిస్తే చాలు 54 వేల డాలర్లు ( రూ.37 లక్షలు) సొంతమవుతాయి. మొత్తం టోర్నీ ప్రైజ్మనీ ఎంతో తెలుసా 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ.363 కోట్లు). ఇది మొన్న సాకర్ విజేతకు ఇచ్చిన ప్రైజ్మనీ కంటే ఎక్కువ. గత మూడేళ్లుగా నగదు బహమతిని పెంచుతూ వచ్చామని అమెరికా టెన్నిస్ సంఘం చైర్మన్ కట్రినా ఆడమ్స్ తెలిపారు. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమాన ప్రైజ్మనీ ఇచ్చిన తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ కూడా యూఎస్ ఓపెన్. 1973 నుంచే సింగిల్స్ విజేతలకు ప్రైజ్మనీ సరిసమానం చేసిన చరిత్ర ఈ టోర్నీదే. వచ్చే నెల 27న మొదలయ్యే ఈ గ్రాండ్స్లామ్ టోర్నికి ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుక కానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







