యూఎస్ ఓపెన్ ప్రైజ్మనీ రూ. 26 కోట్లు
- July 20, 2018యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 38 లక్షల డాలర్లు (రూ.26 కోట్లు) పొందవచ్చు. నిర్వాహకులు సింగిల్స్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్మనీని భారీగా పెంచారు. గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్మనీ కావడం విశేషం. కేవలం మెయిన్ డ్రా కు అర్హత సాధిస్తే చాలు 54 వేల డాలర్లు ( రూ.37 లక్షలు) సొంతమవుతాయి. మొత్తం టోర్నీ ప్రైజ్మనీ ఎంతో తెలుసా 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ.363 కోట్లు). ఇది మొన్న సాకర్ విజేతకు ఇచ్చిన ప్రైజ్మనీ కంటే ఎక్కువ. గత మూడేళ్లుగా నగదు బహమతిని పెంచుతూ వచ్చామని అమెరికా టెన్నిస్ సంఘం చైర్మన్ కట్రినా ఆడమ్స్ తెలిపారు. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమాన ప్రైజ్మనీ ఇచ్చిన తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ కూడా యూఎస్ ఓపెన్. 1973 నుంచే సింగిల్స్ విజేతలకు ప్రైజ్మనీ సరిసమానం చేసిన చరిత్ర ఈ టోర్నీదే. వచ్చే నెల 27న మొదలయ్యే ఈ గ్రాండ్స్లామ్ టోర్నికి ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుక కానుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..