యూఎస్ ఓపెన్ ప్రైజ్మనీ రూ. 26 కోట్లు
- July 20, 2018
యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 38 లక్షల డాలర్లు (రూ.26 కోట్లు) పొందవచ్చు. నిర్వాహకులు సింగిల్స్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్మనీని భారీగా పెంచారు. గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్మనీ కావడం విశేషం. కేవలం మెయిన్ డ్రా కు అర్హత సాధిస్తే చాలు 54 వేల డాలర్లు ( రూ.37 లక్షలు) సొంతమవుతాయి. మొత్తం టోర్నీ ప్రైజ్మనీ ఎంతో తెలుసా 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ.363 కోట్లు). ఇది మొన్న సాకర్ విజేతకు ఇచ్చిన ప్రైజ్మనీ కంటే ఎక్కువ. గత మూడేళ్లుగా నగదు బహమతిని పెంచుతూ వచ్చామని అమెరికా టెన్నిస్ సంఘం చైర్మన్ కట్రినా ఆడమ్స్ తెలిపారు. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమాన ప్రైజ్మనీ ఇచ్చిన తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ కూడా యూఎస్ ఓపెన్. 1973 నుంచే సింగిల్స్ విజేతలకు ప్రైజ్మనీ సరిసమానం చేసిన చరిత్ర ఈ టోర్నీదే. వచ్చే నెల 27న మొదలయ్యే ఈ గ్రాండ్స్లామ్ టోర్నికి ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుక కానుంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









