యూజర్స్కి షాక్ ఇచ్చిన వాట్సాప్..
- July 20, 2018
టెక్నాలజీ పరిగెడుతోంది.. దాంతో పాటు యువత కూడా పరిగెడుతోంది. ప్రసుత్తం ఉన్న టెక్నాలజీని వాడుకుని యువత అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది. అయితే కొంతమంది మాత్రం తల దించుకుని పరిగెడుతున్నారు. మెడలు వంచేసుకుని సెల్ ఫోన్ లోకే చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మరచిపోయి మరీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ.. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యంగా మల్టిపుల్ చాట్లకు మెసేజ్ను ఫార్వార్డ్ చేసుకునేలా వాట్సాప్ ఫీచర్ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున్న మెసేజ్లు ఫార్వార్డ్ చేస్తూ... నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారు.
అటువంటి తప్పుడు మేసేజ్లు వైరల్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్ను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో వాట్సాప్ సైతం నకిలీ వార్తలు విజృంభించకుండా చూస్తున్నాయి.
వాట్సాప్ మెసేజ్లు, ఇమేజ్లు, వీడియోలు పెద్ద మొత్తంలో ఫార్వార్డ్ కాకుండా ఉండేందుకు వాట్సాప్ గట్టి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వాట్సాప్లో ఫార్వార్డ్ అయ్యే టెస్ట్పై పరిమితి విధించినట్టు వాట్సాప్ ప్రకటించింది. కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్ ఫార్వార్డ్ అయ్యేలా నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్లకు క్విక్ ఫార్వార్డ్ బటన్ను తీసేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







