యూజర్స్కి షాక్ ఇచ్చిన వాట్సాప్..
- July 20, 2018
టెక్నాలజీ పరిగెడుతోంది.. దాంతో పాటు యువత కూడా పరిగెడుతోంది. ప్రసుత్తం ఉన్న టెక్నాలజీని వాడుకుని యువత అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది. అయితే కొంతమంది మాత్రం తల దించుకుని పరిగెడుతున్నారు. మెడలు వంచేసుకుని సెల్ ఫోన్ లోకే చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మరచిపోయి మరీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ.. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యంగా మల్టిపుల్ చాట్లకు మెసేజ్ను ఫార్వార్డ్ చేసుకునేలా వాట్సాప్ ఫీచర్ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున్న మెసేజ్లు ఫార్వార్డ్ చేస్తూ... నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారు.
అటువంటి తప్పుడు మేసేజ్లు వైరల్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్ను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో వాట్సాప్ సైతం నకిలీ వార్తలు విజృంభించకుండా చూస్తున్నాయి.
వాట్సాప్ మెసేజ్లు, ఇమేజ్లు, వీడియోలు పెద్ద మొత్తంలో ఫార్వార్డ్ కాకుండా ఉండేందుకు వాట్సాప్ గట్టి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వాట్సాప్లో ఫార్వార్డ్ అయ్యే టెస్ట్పై పరిమితి విధించినట్టు వాట్సాప్ ప్రకటించింది. కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్ ఫార్వార్డ్ అయ్యేలా నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్లకు క్విక్ ఫార్వార్డ్ బటన్ను తీసేసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







