ఢిల్లీలో విషాదం.. భవనం కూలి 5 మంది మృతి..
- September 26, 2018
ఢిల్లీ:ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. శిధిలావ్యవస్థలో ఉన్న ఓ భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్3లో ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు ఆరుగురితో కూడిన రెస్క్యూ టీమ్ పనిచేస్తోంది. కాగా ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన మహిళను మున్నీగా గుర్తించారు. ఇదిలావుంటే ఈ భవనం 20 ఏళ్ల క్రితం నాటిదని, శిథిలావస్థకి చేరుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







