ఢిల్లీలో విషాదం.. భవనం కూలి 5 మంది మృతి..
- September 26, 2018
ఢిల్లీ:ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. శిధిలావ్యవస్థలో ఉన్న ఓ భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్3లో ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు ఆరుగురితో కూడిన రెస్క్యూ టీమ్ పనిచేస్తోంది. కాగా ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన మహిళను మున్నీగా గుర్తించారు. ఇదిలావుంటే ఈ భవనం 20 ఏళ్ల క్రితం నాటిదని, శిథిలావస్థకి చేరుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









