ప్రోస్టేట్‌ క్యాన్సర్‌పై అవగాహన: బైకర్స్‌ ర్యాలీ

- October 06, 2018 , by Maagulf
ప్రోస్టేట్‌ క్యాన్సర్‌పై అవగాహన: బైకర్స్‌ ర్యాలీ

బహ్రెయిన్:సెప్టెంబర్‌ 30న ప్రపంచ వ్యాప్తంగా 650 నగరాల్లో మోటర్‌ సైక్లిస్ట్స్‌ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, మెంటల్‌ హెల్త్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. కాగా, బహ్రెయిన్‌లో నిన్ననే ఈ ర్యాలీ జరిగింది. మహ్ది అసీరీ, ఫాడీ వస్సెఫ్‌, ఫాదెల్‌ మఖ్లూక్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసీరి మాట్లాడుతూ, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తోపాటు పురుషుల మెంటల్‌ హెల్త్‌పై అవగాహన కల్పించడమే ఈ ఈవెంట్‌ ఉద్దేశ్యమని చెప్పారు. మోటార్‌ బైక్‌ రైడర్స్‌ అలాగే గెస్ట్‌లు ఎక్కువమంది ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారనీ, రైడర్స్‌ అలాగే గెస్ట్‌లు అందమైన దుస్తుల్లో ఆకర్షణీయంగా కన్పించారని నిర్వాహకులు తెలిపారు. చిన్న వయసులోనే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోవడం కారణమని, మరోపక్క మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ ఎక్కువవుతున్నారనీ, ఈ నేపథ్యంలో క్యాన్సర్‌, మెంటల్‌ హెల్త్‌పై అవగాహన కోసం బైక్‌ ర్యాలీ చేపట్టామని నిర్వాహకులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com