పంజాబ్ నుండి పాక్ కు రహదారి మార్గానికి శంకుస్థాపన
- November 26, 2018
న్యూఢిల్లీ : పంజాబ్లో డేరాబాబా నానక్ నుండి పాకిస్తాన్లో గల కర్తార్పూర్కు నిర్మించే ఆరు కిలోమీటర్ల దూరం గల రహదారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్లు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. విభజన అనంతరం మూసివేసిన ఈ మార్గాన్ని పున:ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పున:ప్రారంభించినట్లు అవుతుందని అధికారులు తెలిపారు. కాగా, బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కర్తార్పూర్లో శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాది గురునానక్ 550 జయంతి సందర్భంగా నవంబర్ 2019 నాటికి కర్తార్పూర్లోని సాహిబ్ గురుద్వారాను సందర్శించేందుకు వీలుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాకిస్తాన్తో సంబంధాలు మరింత మెరుగుపడగలవని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!







