పంజాబ్ నుండి పాక్ కు రహదారి మార్గానికి శంకుస్థాపన
- November 26, 2018
న్యూఢిల్లీ : పంజాబ్లో డేరాబాబా నానక్ నుండి పాకిస్తాన్లో గల కర్తార్పూర్కు నిర్మించే ఆరు కిలోమీటర్ల దూరం గల రహదారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్లు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. విభజన అనంతరం మూసివేసిన ఈ మార్గాన్ని పున:ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పున:ప్రారంభించినట్లు అవుతుందని అధికారులు తెలిపారు. కాగా, బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కర్తార్పూర్లో శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాది గురునానక్ 550 జయంతి సందర్భంగా నవంబర్ 2019 నాటికి కర్తార్పూర్లోని సాహిబ్ గురుద్వారాను సందర్శించేందుకు వీలుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాకిస్తాన్తో సంబంధాలు మరింత మెరుగుపడగలవని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







