సౌదీపై హౌతి మిస్సైల్‌ ఎటాక్‌: ఇద్దరికి గాయాలు

- December 01, 2018 , by Maagulf
సౌదీపై హౌతి మిస్సైల్‌ ఎటాక్‌: ఇద్దరికి గాయాలు

జెడ్డా: సౌదీ అరేబియా సౌత్‌ వెస్టర్న్‌ ప్రాంతంలో మిస్సైల్‌ దాడి కారణంగా ఇద్దరికి గాయాలయ్యాయి. యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదులు ఈ మిస్సైల్‌ని సంధించారు. సివిల్‌ డిఫెన్స్‌ అధికార ప్రతినిథి కల్నల్‌ యాహ్యా అబ్దుల్లా అల్‌ కమ్తాని మాట్లాడుతూ, సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకున్నాయనీ, మిస్సైల్‌ దాడి ఓ ఇంటి మీద జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో యెమెన్‌కి చెందిన మహిళ, సౌదీ జాతీయుడు గాయపడ్డారని తెలిపారు. యెమెన్‌ నుంచి హౌతీ తీవ్రవాదులు, సౌదీలోని ప్రముఖ నగరాలు, ముఖ్యంగా జనం ఎక్కువగా వుండే ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్‌ దాడికి పాల్పడుతుండడం జరుగుతోంది. అయితే వీటిని ఎప్పటికప్పుడు అత్యంత చాకచక్యంగా సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ కూల్చివేస్తూనే వున్నాయి. చాలా అరుదుగా మాత్రమే హౌతీ తీవ్రవాదుల మిస్సైల్స్‌, లక్ష్యాన్ని తాకుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com