సౌదీపై హౌతి మిస్సైల్ ఎటాక్: ఇద్దరికి గాయాలు
- December 01, 2018
జెడ్డా: సౌదీ అరేబియా సౌత్ వెస్టర్న్ ప్రాంతంలో మిస్సైల్ దాడి కారణంగా ఇద్దరికి గాయాలయ్యాయి. యెమెన్లోని హౌతీ తీవ్రవాదులు ఈ మిస్సైల్ని సంధించారు. సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి కల్నల్ యాహ్యా అబ్దుల్లా అల్ కమ్తాని మాట్లాడుతూ, సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకున్నాయనీ, మిస్సైల్ దాడి ఓ ఇంటి మీద జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో యెమెన్కి చెందిన మహిళ, సౌదీ జాతీయుడు గాయపడ్డారని తెలిపారు. యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు, సౌదీలోని ప్రముఖ నగరాలు, ముఖ్యంగా జనం ఎక్కువగా వుండే ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ దాడికి పాల్పడుతుండడం జరుగుతోంది. అయితే వీటిని ఎప్పటికప్పుడు అత్యంత చాకచక్యంగా సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేస్తూనే వున్నాయి. చాలా అరుదుగా మాత్రమే హౌతీ తీవ్రవాదుల మిస్సైల్స్, లక్ష్యాన్ని తాకుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







