బహ్రెయిన్‌లో పర్యటించనున్న కేరళ స్పెషల్‌ కిడ్స్‌

- December 03, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో పర్యటించనున్న కేరళ స్పెషల్‌ కిడ్స్‌

వరల్డ్‌ డిజేబుల్‌ డే సందర్భంగా లులు హైపర్‌ మార్కెట్‌, ఛాయిస్‌ అడ్వర్టయిజింగ్‌ అండ్‌ పబ్లిసిటీ, థనాల్‌ స్కూల్‌ ఫర్‌ డిఫరెంట్లీ ఏబుల్డ్‌ 700 మంది విద్యార్థుల్ని కేరళ నుంచి బహ్రెయిన్‌కి తీసుకురానుంది. విద్యార్థులు జనవరి 13న బహ్రెయిన్‌ చేరుకుంటారు. అలాగే స్కూల్‌, ఇంటర్నేషనల్‌ సెమినార్‌ కూడా నిర్వహించనుంది. దీనికి 'టువార్డ్స్‌ ఈక్వాలిటీ ఫర్‌ డిజేబులిటీ' అనే పేరు పెట్టారు. జనవరి 9న ఇండియన్‌ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్‌ అన్నా క్లమాంత్‌, స్మితా నాజర్‌ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 'చిరియిలెకుల్లా దూరమ్‌' అనే సోషల్‌ డ్రామాని ఇక్కడ ప్లే చేస్తారు. జనవరి పదిన ఈ డ్రామా బహ్రెయిన్‌ కేరళీయ సమాజంలో జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com