హైటెక్స్లో ఘనంగా ముగిసిన ఆల్ లైట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - ఎఎల్ఐఐఎఫ్ఎఫ్
- December 06, 2018ఆల్ లైట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ హైద్రాబాద్లో ఘనంగా ముగిసింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగిన ఈ ఫిలిం ఫెస్టివల్లో అనేక ఈవెంట్స్ జరిగాయి. సినీ పరి&శ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, ఇండియాలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ ఫెస్టివల్కి హాజరై, పలు ఈవెంట్స్లో పాల్గొన్నారు. క్లోజింగ్ సెర్మనీలో భాగంగా ప్రతిష్టాత్మక గోల్డెన్ ఫ్రేమ్ అవార్డ్స్ బహూకరణ జరిగింది. ఔత్సాహికులు, టాలెంట్ వున్నవారికి ఈ ఫెస్టివల్ ఓ ప్రత్యేకమైన వేదికగా నిలిచింది. షార్ట్ ఫిలిం సహా పలు విభాగాల్లో విజేతలకు బహుమతులు అందించారు. సినిమాల ప్రదర్శన, ఫ్యాషన్ షో, సినిమాకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు.. ఇలా చాలా ఈవెంట్స్కి ఈ ఆల్ లైట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మంచి వేదికగా నిలిచిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్